Begin typing your search above and press return to search.

చెర్రీ సాలిడ్ లైనప్.. అగ్ర దర్శకులతో వరుస సినిమాలు..!

By:  Tupaki Desk   |   12 Jun 2021 8:30 AM GMT
చెర్రీ సాలిడ్ లైనప్.. అగ్ర దర్శకులతో వరుస సినిమాలు..!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చేస్తున్నాడు. అలానే కొరటాల శివ దర్శకత్వంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ చివరి దశకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. దీని తర్వాత చెర్రీ ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడంటూ రోజుకో న్యూస్ వస్తూనే ఉంది.

ఈ నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ లైనప్ మీద అత‌డి స‌న్నిహిత వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ కంటే ముందే 'ఆచార్య‌' సినిమాతో చెర్రీ ఫ్యాన్స్ ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్' - '#RC15' చిత్రాలు రానున్నాయి. ఆ త‌రువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొర‌టాల శివ‌ లతో కూడా రామ్ చరణ్ సినిమాలు ఉంటాయని టాక్ నడుస్తోంది. అలానే ప్రశాంత్ నీల్ - పూరీ జగన్నాథ్ లతో కూడా చర్చలు జరుగుతున్నాయని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

ఏదేమైనా 'RRR' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వస్తుంది కాబట్టి, దాన్ని కాపాడుకునే విధంగా చరణ్ లైనప్ ఉండబోతోందని అర్థం అవుతోంది. తాను నటించే ప్రతి చిత్రాన్ని కూడా తెలుగుతో పాటుగా ఇతర భాష‌ల్లో కూడా ఒకేసారి విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. చెర్రీ లైనప్ పై చిరంజీవి కూడా హైపీగా ఉన్నట్లు తెలుస్తోంది.