Begin typing your search above and press return to search.

ఇది టూ మచ్ కదూ చెర్రీ!!

By:  Tupaki Desk   |   30 Dec 2016 11:00 AM IST
ఇది టూ మచ్ కదూ చెర్రీ!!
X
ధృవ సక్సెస్ ను రామ్ చరణ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అదే టైంలో తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న ఖైదీ నంబర్ 150 పనులు కూడా పూర్తి చేసేశాడు. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది. సంక్రాంతి తర్వాత సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు చెప్పిన మెగా పవర్ స్టార్.. ఈ మూవీ కోసం కొత్త లుక్ ట్రై చేయనున్నాడు. గెడ్డం లుక్ తో కనిపించనున్నానని.. సుకుమార్ ఇంకా పెరగాలని రీసెంట్ గా చెప్పాడు కూడా.

అయితే.. సుక్కుతో చేయబోయే సినిమా విషయంలో ఇంకా హీరోయిన్ కన్పాం కాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ గా నటింప చేసేందుకు రాశి ఖన్నా.. సమంత.. సాయి పల్లవి.. అనుపమా పరమేశ్వరన్.. కీర్తి సురేష్ లను సంప్రదించారు. వీరిలో కొందరితో సీరియస్ గా మాటామంతీ జరపగా.. మరికొందరిని ఆడిషన్ కూడా చేశారు. అయినా హీరోయిన్ విషయంలో దర్శకుడు ఫైనల్ డెసిషన్ కి రాలేదట. వచ్చే వారంలో అమలా పాల్ ను ఆడిషన్ కోసం పిలిచినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ భామ చరణ్ తో కలిసి నాయక్ మూవీలో ఆడిపాడింది.

త్వరలో హీరోయిన్ ను ఫైనల్ చేసేసి మిగిలిన పనుల్లోకి వెళ్లిపోయిందుకు రెడీ అవుతున్నారట సుక్క అండ్ చెర్రీ. అయితే.. హీరోయిన్ విషయంలో సంతృప్తి చెందనిది చరణ్ కాదని.. సుకుమార్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. సుక్కు కెరీర్ మొత్తంలో రాసుకున్న బెస్ట్ స్క్రిప్ట్ ఇదేనని అందుకే.. చిన్నా పెద్దా ఏ విషయంలోనూ రాజీ పడకూడదని అనుకుంటున్నాడట సుకుమార్.