Begin typing your search above and press return to search.

ప్రొడక్షన్ పై క్లారిటీ ఇచ్చేసిన మెగా పవర్ స్టార్

By:  Tupaki Desk   |   8 Jan 2019 12:56 PM GMT
ప్రొడక్షన్ పై క్లారిటీ ఇచ్చేసిన మెగా పవర్ స్టార్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' జనవరి 11 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు చరణ్. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో కొణిదెల ప్రొడక్షన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాన్నగారి రీ ఎంట్రీ చిత్రం 'ఖైది నెం. 150' ను నిర్మించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా మొదటి సినిమాతోనే చరణ్ విజయం సాధించాడు. ఇక రెండో సినిమాను కూడా మెగాస్టార్ తోనే మరింత భారీ ప్రాజెక్ట్ 'సైరా' ను ప్రారంభించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. చరణ్ ఈ సినిమాతో ఆపకుండా ఇతర హీరోలతో కూడా కొణిదెల బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తాడని కూడా గతంలో ప్రచారం సాగింది. అఖిల్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చేశాడు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ నాన్నగారి సినిమాలు నిర్మించేందుకు మాత్రమేనని తేల్చేశాడు. నాన్నగారి సినిమాలు చేయాలన్న ఆలోచనతోనే ఈ బ్యానర్ ను స్థాపించానని తెలిపాడు. తన చుట్టూ చాలా మంచి నిర్మాతలు ఉన్నారని అందుకే తన సినిమాలు కూడా బయట వారి బ్యానర్లోనే చేస్తానని అన్నాడు. నటన.. సినిమాల నిర్మాణం రెండూ ఒకేసారి చేయడం కష్టమని అన్నాడు. ఇతర హీరోలతో సినిమాలు చేసే ఆలోచన లేదన్నాడు.