Begin typing your search above and press return to search.

ఆ జోడి ఇంకా సెట్ కాలేదమ్మా

By:  Tupaki Desk   |   3 Dec 2017 3:30 AM GMT
ఆ జోడి ఇంకా సెట్ కాలేదమ్మా
X
వెండితెరపై హీరో హీరోయిన్ జోడి ఒక్కసారి మంచి హిట్ అందుకుంటే చాలు నెక్స్ట్ సినిమాలకు కూడా ఆ జంట ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తే బావుంటుందని ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్ లో అలాంటి జోడీలు ఒకప్పుడు చాలా ఉండేవి వరుసగా హిట్స్ రిపీట్ అవుతున్న కొద్దీ చేస్తూనే ఉండేవారు. కానీ ఈ మధ్య ఒకసారి కలిసిన జోడి మళ్లీ కలవడానికి సమయం చాలానే పడుతోంది.

ఇక అసలు విషయానికి వస్తే నేను శైలజా సినిమాలో క్యూట్ లవర్స్ గా కనిపించి హార్ట్ ని టచ్ చేసిన రామ్ - కీర్తి సురేష్ జంట మరోసారి కలవనుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. రామ్ కూడా ఆ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు. రీసెంట్ గా ఉన్నది ఒకటే జిందగి సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న రామ్ నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే లక్కీగా తన లక్కీ హీరోయిన్ తో మరోసారి జోడి కట్టేందుకు రెడీ అయ్యాడు అని నిన్నా మొన్నటి వరకు న్యూస్ వచ్చింది. అయితే ఆ కాంబో ఇంకా ఫైనల్ కాలేదు అని తెలుస్తోంది. రామ్ ఇటీవల దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే.

సినిమా చూపిస్తా మావా - నేను లోకల్ సినిమాతో మంచి హిట్స్ అందుకున్న దర్శకుడు త్రినాధ రావ్ నక్కిన ఆ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే నేను లోకల్ లో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి హీరోతో దర్శకుడితో కొత్త మూవీ చేసే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు.

దర్శకుడు కూడా వేరే హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ లో సాయి పల్లవి - అను ఇమ్మాన్యుల్ ఉన్నారని సమాచారం. మరి ఎవరిని సెట్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.