Begin typing your search above and press return to search.

'సైక్లింగ్'తో రోడ్లెక్కుతున్న సినీతారలు.. ఫస్ట్ డేనే 30కిలోమీటర్లు రైడ్..!!

By:  Tupaki Desk   |   19 Aug 2020 5:33 PM GMT
సైక్లింగ్తో రోడ్లెక్కుతున్న సినీతారలు.. ఫస్ట్ డేనే 30కిలోమీటర్లు రైడ్..!!
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ వాళ్ల ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా.. ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా సమయాన్ని గడుపుతున్నారు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు చేసే ప్రతి పని చాలా సరదాగా ఉంటుంది. ముంబైలో మూడు నెలల పాటు ఒకేచోట గడిపిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. దాదాపు ఆరు నెలల తర్వాత రకుల్ హైదరాబాద్ వచ్చానని చెప్పింది. ముంబైలో గడిపిన ఆమె రకుల్ ప్రీత్ సింగ్ తన లాక్డౌన్ అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అయితే హైదరాబాద్ లో ఉంటున్న రకుల్.. తాజాగా నటి లక్ష్మి మంచుతో కలిసి సైకిల్ రైడ్ కి వెళ్లిందట. ఈ భామ ఫిట్నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తన వర్కౌట్ల ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇదివరకే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో చేసిన రకుల్.. తాజాగా వర్షంలో ఫ్రెండ్స్ తో సైక్లింగ్ చేసిన వీడియో షేర్ చేసింది.

అయితే ఈ సైక్లింగ్ లో రకుల్ తో పాటు మంచు లక్ష్మి కూడా పాల్గొన్న ఫోటోలు షేర్ చేసింది. సైక్లింగ్ కి కేవలం రకుల్, మంచు లక్ష్మి మాత్రమే కాదు. వారితో పాటు ప్రముఖ సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా.. రకుల్ సోదరుడు అమన్ ప్రీత్.. ఇతర స్నేహితులు కూడా సైక్లింగ్ లో పాల్గొన్నారు. ఇక వీరంతా కలిసి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినట్లు రకుల్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది రకుల్. అదికూడా హైదరాబాద్‌ నగరంలోని సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి మొదలుపెట్టి తూప్రాన్ రోడ్డు మీదుగా రకుల్, లక్ష్మి ఇద్దరు సైక్లింగ్‌ చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే 'థ్యాంక్యు.. చాలా ఇష్టపడి చేశాం. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ కూడా చేస్తాం' అంటూ రకుల్ ప్రీత్ ట్విట్టర్ వేదికగా నవ్వుతున్న ఎమోజి పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ముంబై రోడ్ల పై సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందట. ఇక రకుల్ ప్రస్తుతం భారతీయుడు-2, అయలన్ సినిమాలతో బిజీగా ఉంది. మొత్తానికి అందమైన భామలంతా రోడ్లెక్కి సైక్లింగ్ చేస్తుంటే చూడటానికి ఎంతో బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.