Begin typing your search above and press return to search.

పీపీఈ సూట్ లో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్...!

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:30 PM GMT
పీపీఈ సూట్ లో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్...!
X
సినీ సెలబ్రెటీలు గత రెండున్నర నెలలుగా దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇంట్లోనే ఉండిపోయారు. గత కొన్ని రోజులుగా లాక్‌ డౌన్ నిబంధనలు సడలింపులు ఇస్తుండటంతో సినీ ప్రముఖులు స్వీయ గృహ నిర్బంధం నుండి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అనుమతులు లభించి విమాన సర్వీసులు పునరుద్ధరించడంతో ఒక్కొక్కరుగా ప్రయాణాలు కూడా చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే షూటింగ్స్ కి అనుమతులు లభించడంతో షూటింగ్స్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా కాలు బయటపెట్టింది. తాజాగా ముంబై విమానాశ్రయంలో వింత గెటప్ లో దర్శనమిచ్చింది. కాకపోతే ఆ గెటప్ ఏదో సినిమా షూటింగ్ కోసమో అనుకుంటే పొరపాటే. ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం ఫ్లైట్స్ లో ప్రయాణించేవారు తప్పకుండా సెఫ్టీ మెజర్స్ పాటించాలి. దీంతో రకుల్ కూడా పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్స్ అయిన ఎన్ 95 మాస్క్.. గ్లోవ్స్ తో పాటు అరికాళ్ళ నుండి తల వరకూ ఒంటినిండా దుస్తులు కప్పేసుకొని కనిపించింది. ముంబై నుండి ఢిల్లీకి ప్రయాణమైన ఈ బ్యూటీతో పాటు రకుల్ హిందీలో నటిస్తున్న 'అటాక్' దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు.

కాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో రకుల్ ని గుర్తుపట్టిన ఫొటోగ్రాఫర్లు ఫోటోకు ఫోజివ్వు.. వెనుకకు తిరిగి కెమెరా వైపు చూడు అంటూ పిలుస్తుండటంతో చిరాకు పడ్డారట. 'ఫోటోలు తీయవద్దు. ఎందుకింత టూమచ్ అటెన్షన్' అంటూ రకుల్ వారిపై మండిపడ్డారట. అసహనంతో వారివైపు చూస్తూ ఎయిర్‌ పోర్టులోకి వెళ్లిపోయిందట. అయినా వదలకుండా వెంటపడి రకుల్ ని కెమెరాల్లో భందించేసారు. ఇప్పుడు రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తన ప్రయాణం గురించి రకుల్ ప్రీత్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మిషన్ ఫ్లైట్.. మిషన్ ఢిల్లీ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు 'అటాక్' డైరెక్టర్ లక్ష్య రాజ్ ఆనంద్ కూడా పీపీఈ సూట్ ధరించి ఉన్నాడు. మొత్తం మీద రకుల్ తన 'అటాక్' సినిమా షూటింగ్ కోసం బయటకు వచ్చిందన్నమాట.