Begin typing your search above and press return to search.

సుప్రీంకు ల‌క్ష్మీస్.. ప్రొడ్యూస‌ర్.. ఏం జ‌రిగిందంటే?

By:  Tupaki Desk   |   1 April 2019 9:06 AM GMT
సుప్రీంకు ల‌క్ష్మీస్.. ప్రొడ్యూస‌ర్.. ఏం జ‌రిగిందంటే?
X
ప‌లు వివాదాలతో వివాదాస్ప‌ద చిత్రంగా నిలిచి.. అడ్డంకుల్ని అధిగ‌మించి ఇటీవ‌ల రిలీజ్ అయిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నిర్మించిన ఈ చిత్రం ఏపీ మిన‌హా మిగిలిన అన్నిచోట్ల విడుద‌లైంది. ఈ చిత్రం సంచ‌ల‌నంగా మారి హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రం విడుద‌ల‌పై ఏపీ హైకోర్టు రియాక్ట్ అవుతూ.. ఏప్రిల్ మూడు వ‌ర‌కూ ఏపీలో విడుద‌ల‌పై స్టే విధించ‌టం తెలిసిందే. ఈ సినిమా ప్రివ్యూను న్యాయ‌మూర్తులు చూసిన త‌ర్వాత విడుద‌ల విష‌య‌మై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హైకోర్టు వెల్ల‌డించింది.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా విడుద‌ల విష‌యంపై న్యాయం చేయాల‌ని కోరుతూ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టారు.చిత్రం విడుద‌ల‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోరారు. నిర్మాత దాఖ‌లు చేసిన పిటిష‌న్ సుప్రీంకోర్టులో దాఖ‌లైంది. దీనిపై సుప్రీం స్పందించాల్సి ఉంది.