Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి- గీతా ఆర్ట్స్ తో మ‌హేష్ పాన్ ఇండియా ప్లాన్!

By:  Tupaki Desk   |   11 March 2021 10:15 AM GMT
రాజ‌మౌళి- గీతా ఆర్ట్స్ తో మ‌హేష్ పాన్ ఇండియా ప్లాన్!
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో సినిమా చేసేందుకు మ‌హేష్ సంసిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత‌ మ‌హేష్ తో సినిమా చేసేందుకు రాజ‌మౌళి లాక్ అయ్యారు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ ని పెద్ద తెర‌పై చూడాల‌ని అభిమానులు చాలా కాలంగా ఆస‌క్తిగా ఉన్నారు. నాలుగైదేళ్లుగా ఈ కాంబినేష‌న్ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ కెళుతుంది అంటూ ప్ర‌చారం సాగినా ఇప్ప‌టివ‌ర‌కూ వీలు ప‌డనేలేదు. ఇటీవ‌లే మ‌హేష్‌ తో సినిమా చేస్తున్నాన‌ని రాజ‌మౌళి మ‌రోసారి అధికారికంగా ధృవీక‌రించారు.

తాజాగా మహేశ్ -రాజ‌మౌళి పాన్ ఇండియా సినిమా ప‌ట్టాలెక్క‌నుందని మ‌రోమారు గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్. రాజమౌళిని రంగంలోకి దించేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని చెబుతున్నారు. స‌ర్కార్ వారి పాట త‌రువాత మ‌హేశ్ న‌టించే సినిమా ఇదేన‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

అయితే ఇది పౌరాణిక కాన్సెప్టుతోనేనా? మ‌హేష్ శ్రీ‌రాముడిగా న‌టిస్తున్నారా? అన్న డౌట్ రైజ్ అవుతోంది. అల్లు బాస్ చాలా కాలంగా రామాయ‌ణం తెర‌కెక్కించే యోచ‌న‌తో ఉన్నారు. ఇందులో మ‌హేష్ శ్రీ‌రాముడిగా న‌టించే వీలుంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. హృతిక్ పేరు కూడా ఒక ఆప్ష‌న్ గా వినిపించింది. అయితే దీనిపై ఇంకా అభిమానుల్లో ఎన్నో సందిగ్ధ‌త‌లు అలానే ఉన్నాయి. తాజా స‌న్నివేశం చూస్తుంటే.. మ‌హేష్ న‌టించ‌బోయేది పురాణేతిహాసం రామాయ‌ణ క‌థ‌లోనేనా? అన్న‌ది తేలాల్సి ఉంది. దీనిపై అల్లు బాస్ కానీ.. రాజ‌మౌళి కానీ అధికారికంగా ఏదైనా హింట్ ఇస్తారేమో చూడాలి. క‌నీసం న‌మ్ర‌త మ‌హేష్ అయినా సోష‌ల్ మీడియాల్లో ఏదైనా లీక్ ఇస్తారేమో వేచి చూడాలి.