Begin typing your search above and press return to search.

RRR యంగ్ గ‌న్స్ ని దించండ‌య్యా!

By:  Tupaki Desk   |   27 Jan 2019 9:24 AM GMT
RRR యంగ్ గ‌న్స్ ని దించండ‌య్యా!
X
ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి RRR జెట్ స్పీడ్ తో పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడే రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. జ‌క్క‌న్న శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. 2020లో రిలీజ్ అనుకున్నారు కాబ‌ట్టి.. అనుకున్న స‌మ‌యానికి సినిమాని పూర్తి చేయాల‌న్న ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలో క‌థానాయిక‌ల్ని ఫైన‌ల్ చేయ‌క‌పోవ‌డంతో అటు చ‌ర‌ణ్ ఫ్యాన్స్, ఇటు తార‌క్ ఫ్యాన్స్ రాజ‌మౌళిపై గుర్రు మీద ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్, రాశీ ఖ‌న్నా, దీపిక ప‌దుకొనే, ఆలియా భ‌ట్, ప్రియాంక చోప్రా, ప‌రిణీతి చోప్రా .. అంటూ ప‌లువురి పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. అయితే వీళ్లలో ఎవ‌రూ క‌న్ఫామ్ కాలేదింకా. నిన్న గాక మొన్న బాలీవుడ్ క‌థానాయిక ప‌రిణీతి చోప్రాని ఫైన‌ల్ చేసేస్తున్నారని, భారీ పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ని ఒక‌టే హ‌డావుడి క‌నిపించింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి సంబంధించి ఏ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

అస‌లు ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎలాంటి క‌థానాయిక‌లు న‌టించాలి? అంటే చ‌ర‌ణ్, తార‌క్ ఫ్యాన్స్ లో ఓ ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. ఈసారి పాత ముఖాల్ని ఎంపిక చేసేకంటే కొత్త భామ‌ల్ని ఎంచుకుంటేనే బావుంటుంద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రియాంక చోప్రా ఇప్ప‌టికే చ‌ర‌ణ్ స‌ర‌స‌న `తుఫాన్` (జంజీర్ రీమేక్)లో న‌టించింది. అందువ‌ల్ల అది పాత మొహ‌మే. పీసీ సిస్ట‌ర్ పరిణీతి చోప్రా పేరు వినిపిస్తోంది కాబ‌ట్టి, వాస్త‌వానికి ఈ అమ్మ‌డికి మ‌రీ అంత సీనేం లేద‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు. అస‌లు ఈ ఉప్మా చోప్రాలు ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో రైజింగ్ లో ఉన్న జాన్వీ క‌పూర్, సారా అలీ ఖాన్ లాంటి నాయిక‌ల పేర్ల‌ను జ‌క్క‌న్న ప‌రిశీలిస్తే బావుంటుంద‌ని ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చ‌ర‌ణ్ - జాన్వీ, తార‌క్ - సారా అలీఖాన్ కాంబినేష‌న్ అయితే అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతుంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. కొంద‌రైతే తార‌క్ - జాన్వీ, చ‌ర‌ణ్ - సారా అయితే ఎలా ఉంటుంది? అంటూ జంబ్లింగ్ చేసి మ‌రీ ప‌రిశీలిస్తున్నారు. మ‌రోవైపు దీపిక‌, ఆలియా లాంటి టాప్ స్టార్ డ‌మ్ ఉన్న క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసుకున్నా ఫ‌ర్వాలేద‌న్న మాట వినిపిస్తోంది. పాత ముఖాల్ని మాత్రం తేవొద్దు దేవుడో! అంటూ జ‌క్క‌న్న‌కు విన్న‌విస్తున్నారు. మొత్తానికి రాజ‌మౌళికి ఇది ఠ‌ఫ్ టైమ్ అనే చెప్పాలి. ఇంత‌కీ ఏ భామ‌ల్ని అత‌గాడు ఫైన‌ల్ చేస్తారో చూడాలి. ఎస్.ఎస్.రాజ‌మౌళి అంటే ఇండియా నంబ‌ర్ 1 డైరెక్ట‌ర్ అన్న మాట వినిపిస్తోంది. నార్త్ వాళ్ల‌కే పాఠాలు నేర్పించిన గురువు అని అభిమానంగా చెప్పుకుంటున్నారంతా. మ‌రి ఆ స్థాయిలోనే జ‌క్క‌న్న ఆలోచ‌న ఉంటుంద‌ని భావిద్దాం.