Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ కోసం రాజ‌మౌళి మ‌రో ప్లాన్

By:  Tupaki Desk   |   23 March 2022 1:40 PM GMT
ట్రిపుల్ ఆర్ కోసం రాజ‌మౌళి మ‌రో ప్లాన్
X
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లో సింహ గ‌ర్జ‌న చేయ‌బోతోంది. ప్రీమియ‌ర్ కు మ‌రికొన్ని గంట‌లే వుండ‌టంతో ప్ర‌తీ ఒక్క‌రిలోనూ టెన్ష‌న్ మొద‌లైంది. ఎలా వుంటుంది? అని ఆడియ‌న్స్‌.. ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మేక‌ర్స్ అంటూ డైరెక్ట‌ర్‌, హీరోస్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి కొన్ని గంట‌ల్లో స్టార్ట్ కాబోయే ప్రీమియ‌ర్స్ తో ట్రిపుల్ ఆర్ ఫ‌లితం దాదాపుగా బ‌య‌టికి రాబోతోంది. పీరియిడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ బ‌జ్ క్రియేట్ అయింది.

దానికి మించిన ప్ర‌మోష‌న్స్ తో రాజ‌మౌళి సినిమాని హోరెత్తిస్తున్నారు. అంత కంత‌కు రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ ప్ర‌మోష‌న్స్ తో హీటెక్కించేస్తున్నారు. ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన కీల‌క విష‌యాన్ని వెల్ల‌డిస్తూ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు. గ‌త వారం రోజుల నుంచే ప్ర‌మోష‌న్స్ ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లారు రాజ‌మౌళి. దేశ వ్యాప్తంగా వున్న కీల‌క న‌గ‌రాల్లో ఈ మూవీని ప్ర‌మోట్ చేస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న స్ట్రాట‌జీని మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డం విశేషం.

'బాహుబ‌లి' టైమ్ లో ప్ర‌చారం విష‌యంలో కొంత త‌డ‌బ‌డిన రాజ‌మౌళి ట్రిపుల్ ఆర్ విష‌యంలో గ‌త అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని ముందే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ట్రిపుల్ ఆర్ ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేశార‌ట‌. దీంతో ఈ మూవీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

మ‌రి కొన్ని గంట‌ల‌లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్న నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన మ‌క‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చేసింది. రిలీజ్ బిఫోర్ ప్ర‌మోష‌న్స్ ని ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప్లాన్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రాజ‌మౌళి ఈ మూవీ రిలీజ్ త‌రువాత కూడా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మ‌రో ప్లాన్ ని సిద్ధం చేశార‌ట‌.

రిలీజ్‌కు ముందు ఈ మూవీని ఎలా ప్ర‌మోట్ చేస్తున్నారో రిలీజ్ త‌రువాత కూడా అదే స్థాయిలో ప్ర‌తీ కీల‌క సిటీలో డైరెక్ట్ గా థియేట‌ర్ల‌కు వెళ్లి ప్రేక్ష‌కుల‌ని క‌లుస్తూ వారితో ఇంట‌రాక్ట్ కానున్నార‌ట‌. థియేట‌ర్ల‌కు స్టార్స్ తో క‌లిసి వెళ్లి ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందు కోసం రాజ‌మౌళి స‌రికొత్త ప్లాన్ ని రెడీ చేసుకున్నార‌ని తెలిసింది. ఇదిలా వుంటే భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఈ మూవీ ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్ షోల ప‌రంగా రికార్డులు సృష్టిస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ ప‌రంగానూ బుక్ మై షో లోనూ ట్రిపుల్ ఆర్ స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌ల‌క‌నుండ‌టంతో అభిమానులు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, గోండు బెబ్బులి కొమ‌రం భీం పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ, ఒలివియా మోరీస్‌, బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌న్‌, అలియాభ‌ట్ న‌టించిన విష‌యం తెలిసిందే.