Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ టార్గెట్ ఆ మూడు న‌గ‌రాలే..!

By:  Tupaki Desk   |   26 Oct 2021 5:50 AM GMT
రాధేశ్యామ్  టార్గెట్ ఆ మూడు న‌గ‌రాలే..!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కథానాయ‌కుడిగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ కాన్వాస్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ ముగించికుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది చిత్ర‌బృందం. 1970-90 కాలం నాటి ల‌వ్ స్టోరీతో సాగే పీరియాడిక్ చిత్రమిది. చిత్రీక‌ర‌ణ అంతా ఆ కాలానికి సంబంధించిన ప్ర‌త్యేక‌మైన సెట్ల‌లో సాగింది. అయితే ప్ర‌ధానంగా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీ..రోమ్..వెనీస్ వంటి అంద‌మైన న‌గ‌రాల్లో జ‌రిగింది. ఇంకా ఇండియాలో షూట్ ని ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్లో..నాటి హెరిటేజ్ క‌ల్చ‌ర్ ని స్ఫురించే అన‌వాళ్ల మ‌ధ్య‌నే జ‌రిపారు.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ కావ‌డంతో యూనిట్ ఆ న‌గ‌రాల్ని.. ప్ర‌దేశాల్ని టార్గెట్ గా చేసి చిత్రీక‌ర‌ణ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అలాగే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గా నిలుస్తాయ‌ని యూనిట్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ఇంత‌కీ ఇట‌లీ..రోమ్ లాంటి న‌గ‌రాల్ని ప్ర‌త్యేకంగా ఎందుకు? టార్గెట్ చేసిన‌ట్లు అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. ఇట‌లీ..రోమ్ వంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే 1970-90 కాలం నాటి అన‌వాళ్లు ఉన్నాయి. చ‌రిత్ర పుట్ట‌ల్లోకి వెళ్తే ఆ న‌గ‌రాల గొప్ప‌త‌నం ఎంతో ఉంది. స‌హ‌జంగానే అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ న‌డుమ విదేశీయులు చ‌రిత్ర ఆన‌వాళ్ల‌ను క‌ప్పిపుచ్చ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డరు.

ఆయా ప్ర‌దేశాల్ని టూరిస్ట్ ప్లేస్ లుగా.. మ్యూజియ‌మ్ లు గా మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు త‌ప్ప‌..ప్ర‌సిద్ధ‌ క‌ట్ట‌డాల్ని కూల‌దోయ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డరు. అలాంటి గొప్ప‌ద‌నం ఇట‌లీ..రోమ్.. వెనీస్ న‌గ‌రాల్లో ఇప్ప‌టికీ క‌నిపిస్తుంది. అందుకే ఆ న‌గ‌రాల్ని ఇప్ప‌టికీ సుంద‌ర న‌గ‌రాలుగా పిలుచుకుంటారు. అనాదిగా వ‌స్తోన్న సంస్కృతి ఇప్ప‌టికీ కొన్నిచోట్ల‌ ప్ర‌పంచ న‌గ‌రాల్లో అంత‌రించిపోయినా ఇట‌లీలో వాడుక‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ఇటలీ నేప‌థ్యంలో ఎక్కువ భాగం షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అవ‌సరం అనుకున్న చోట సెట్లు నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

ఇట‌లీ అందాల్ని సాధార‌ణ కెమెరాలో బంధీ చేస్తేనే ఎంతో అద్భుతంగా క‌నిపిస్తాయి. అలాంటిది దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో పూర్తిగా ఇట‌లీ నేప‌థ్యాన్నే ఎంచుకున్నారంటే? అక్క‌డి అందాల్ని ఇంకెంత ర‌మ‌ణీయ‌తతో చూపిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్- టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జ‌న‌వ‌రి 14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

టీజ‌ర్ కి ద‌క్కిన ఆద‌ర‌ణ ద‌క్కితే చాలు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `రాధేశ్యామ్` నుంచి విక్ర‌మాధిత్య ఇంట్రో వీడియో విడుద‌లైన‌ సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో మెరుపు వేగంతో దూసుకుపోయింది. డిజిట‌ల్ మాధ్య‌మాల్లో ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్ (5కోట్లు) వ్యూస్ ని సాధించి రికార్డులే సృష్టించింది. ఆక‌లి మీదున్న ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అంతేనా `అఖండ‌`..`పుష్ఫ` టీజ‌ర్లు సాధించిన రికార్డులు సైతం కొల్ల‌గొట్టింది. టాలీవుడ్ లో 50 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డానికి `అఖండ‌`కు 16 రోజులు స‌మ‌యం ప‌ట్ట‌గా..`పుష్ప‌`కు 20 రోజులు ప‌ట్టింది. కానీ `రాధేశ్యామ్` ఇంట్రో మాత్రం 24 గంట‌ల్లోనే ఆ ఫీట్ ని సాధించింది. ప్ర‌స్తుతం 65 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఇదే హాయ్యెస్ట్ అని తెలుస్తోంది