Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ ను మరీ లేపుతున్నారు.. సేఫ్‌ ల్యాండింగ్‌ సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   15 Nov 2020 11:30 PM GMT
రాధేశ్యామ్‌ ను మరీ లేపుతున్నారు.. సేఫ్‌ ల్యాండింగ్‌ సాధ్యమేనా?
X
ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమా గురించి సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా హాట్‌ టాపిక్‌ గా ఉంది. నెవ్వర్‌ బిఫోర్‌ ఆన్‌ ఇండియన్ స్ర్కీన్‌(ఇండియన్‌ సినిమా స్క్రీన్‌ పై ఎప్పుడు ఇలాంటి కథ రాలేదు) అంటూ యూనిట్‌ సభ్యులు చేస్తున్న హడావుడితో సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు రూపొందిస్తున్నాడు అంటూ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌ లు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు.

సినిమా కథ విషయం మాత్రమే కాకుండా క్లైమాక్స్‌ విషయంలో కూడా అత్యంత విభిన్నంగా భారీగా ఊహకు అందని విధంగా ఉంటుంది అంటూ వారు చెబుతూ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక సింపుల్‌ సినిమాను చూసినా ఆహా ఓహో అంటారు. అదే భారీ అంచనాల నడుమ మంచి సినిమా వచ్చినా పెదవి విరుస్తారు. అలా చాలా సార్లు గతంలో జరిగింది. అందుకే ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు. సినిమాను ఆకాశమే హద్దు అన్నట్లుగా లేపేస్తున్నారు.

అంతగా లేపిన సినిమాను సేఫ్‌ గా ల్యాండ్‌ చేయగలరా అంటే.. విడుదలైన తర్వాత అంచనాలు అందుకోగలరా అంటూ నెటిజన్స్‌ మరియు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా 1980 నేపథ్యంలో కథ అవ్వడంతో పాటు చాలా స్టైలిష్‌ కథగా ఈ సినిమాను చూపించేందుకు దర్శకుడు చాలా ఖర్చు చేశాడు. తెలుగుతో పాటు సౌత్‌ లో అన్ని భాషలు మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు.