Begin typing your search above and press return to search.

12 ఏళ్ల‌ త‌ర్వాత వెలుగులోకి వ‌స్తోంది

By:  Tupaki Desk   |   11 Dec 2015 5:34 AM GMT
12 ఏళ్ల‌ త‌ర్వాత వెలుగులోకి వ‌స్తోంది
X
అందాల రాశి క‌థానాయిక‌గా మెరిపించిన మెరుపులు ఎన్నో. ద‌శాబ్ధం కింద‌టి వ‌ర‌కూ నాయిక‌గా అడ‌పాద‌డ‌పా క‌నిపించేది. అయితే ఉన్న‌ట్టుండి ఒబేసిటీ లెవ‌ల్స్‌ కి వెళ్లిపోయి రేసులోంచి అర్థాంత‌రంగా త‌ప్పుకుంది. అయితే జీవితం అనే డెస్టినీ త‌న‌ని ఎటో తీసుకెళ్లిపోయింది. క‌థానాయిక‌గా న‌టిస్తున్న రోజుల్లోనే నివాస్ అనే కోడైరెక్ట‌ర్‌ ని హ‌ఠాత్తుగా పెళ్లాడేసి సినిమాల‌కు గుడ్ బాయ్ చెప్పేసింది. నివాస్ ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌ గానూ కొన‌సాగుతున్నారు. అయితే డెస్టినీ ఎప్పుడు ఎక్క‌డ ఎలా మారుతుంది? అన్న‌ది ఎవ‌రూ ఊహించ‌లేరు. అందుకే ఇప్పుడు మ‌రోసారి సినీఎంట్రీ ఇచ్చేందుకు రాశీ రెడీ అవుతున్నారు.

దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి ముఖానికి రంగేసుకోబోతోంది రాశీ. ఇదే విష‌యంపై త‌ను మాట్లాడుతూ.. ''చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి న‌ట‌న‌లోకి వ‌స్తున్నా. అయితే ఇంత గ్యాప్ వ‌చ్చినా నాకు కెమెరా ముందు కొత్త‌గా అనిపించ‌లేదు. అప్పుడెలా ఉందో ఇప్పుడూ కూడా అలానే ఉంది.. వెన‌క‌టి రోజుల‌కు ఇప్ప‌టికి చాలానే తేడా వ‌చ్చింది. అప్పుడు నేను కేవ‌లం గ్లామ‌ర్‌ కే ప‌రిమితం కాలేదు. చ‌క్క‌గా న‌టించే పాత్ర‌ల‌కు స్కోప్ ఉండేది. కానీ ఇప్పుడ‌లా కాదు. ఏదో చేశాంలే అనిపించే క్యారెక్ట‌ర్ల‌లో హీరోయిన్‌ లు క‌నిపిస్తున్నారు'' అని చెప్పింది.

తెలుగమ్మాయిలు క‌థానాయిక‌లుగా వెలిగిపోతున్నారు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. ''అలాంటిదేం లేదు. తెలుగ‌మ్మాయిలు క‌థానాయిక‌లుగా వ‌స్తున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నాయ్'' అని రాశీ త‌న అభిప్రాయం చెప్పారు. అస‌లింత‌కీ రాశీ ప్ర‌స్తుతం ఏ సినిమాలో న‌టిస్తున్నారు ఈవిడ? లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 'క‌ళ్యాణ వైభోగ‌మే' చిత్రంలో క‌థానాయిక మాళ‌విక న‌య్య‌ర్‌ కి త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తోంది.