Begin typing your search above and press return to search.

టికెట్ కౌంట‌ర్ కి వైర‌స్ సోకింది

By:  Tupaki Desk   |   18 Dec 2019 1:05 PM GMT
టికెట్ కౌంట‌ర్ కి వైర‌స్ సోకింది
X
సినిమాలో న‌టించిన అందాల భామ‌లే థియేట‌ర్ టికెట్ కౌంట‌ర్లో కూచుని టిక్కెట్లు అమ్మేలా చ‌ట్టం చేస్తే? ఇంకేమైనా ఉందా? కౌంట‌ర్లు జామ్ అయిపోవూ.. టిక్కెట్లు క్ష‌ణాల్లో ఆవిరైపోవ‌డం గ్యారెంటీ. ఇదిగో ఇక్క‌డ అలాంటి స‌న్నివేశ‌మే కనిపిస్తోంది. హైద‌రాబాద్ గోకుల్ థియేట‌ర్లో ప్ర‌త్య‌క్ష‌మైంది అందాల రాశీ ఖ‌న్నా.

అక్క‌డ కౌంట‌ర్లో కూచుని టిక్కెట్లు సేల్ చేసింది. ఇంకేం ఉంది.. థియేట‌ర్లో రాశీ ఉంద‌ని తెలుసుకున్న బోయ్స్ ఉర‌క‌లెత్తారు. టిక్కెట్లు కొనేందుకు పోటీప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే రాశీ ఖ‌న్నా కౌంట‌ర్ ఇన్ సైడ్ ఉండ‌డంతో సెల్ఫీ నేరుగా ద‌గ్గ‌ర‌గా వెళ్లి తీసుకునే అవ‌కాశం క‌ల‌గ‌లేదు. అయితేనేం టిక్కెట్లు కొనుక్కుని సంతృప్తి ప‌డ్డారు. కౌంట‌ర్లో కూచున్న అందాల వైర‌స్ వేడెక్కించ‌డంతో అక్క‌డ గుంపులో ఒక‌టే క‌ల‌క‌లం ఏర్ప‌డింది మ‌రి.

ఇక ఇదే తీరుగా క‌థానాయిక‌లంతా టిక్కెట్ కౌంట‌ర్ల‌లో కూచుని టిక్కెట్లు అమ్మితే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. సినిమాకి ప‌బ్లిసిటీ క‌లిసొస్తుంది. ప‌నిలో ప‌నిగా ఆ థియేట‌ర్లు మాస్ జ‌నంతో నిండిపోవ‌డం ఖాయం. సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా జంట‌గా న‌టించిన `ప్రతిరోజు పండగే` ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కౌంట‌ర్లో టికెట్లు అమ్మింది రాశి. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సత్యరాజ్- రావు రమేష్- నరేష్- మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్ 2- యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. థమన్ సంగీతం అందించారు.