Begin typing your search above and press return to search.

రాశీ మాలీవుడ్ ఆశ‌లు ఫ‌లించేనా?

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:30 AM GMT
రాశీ మాలీవుడ్ ఆశ‌లు ఫ‌లించేనా?
X
ఢిల్లీబ్యూటీ రాశిఖ‌న్నా న‌టిగా ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్...కోలీవుడ్ అంటూ రెండు భాష‌ల్ని చుట్టేస్తోంది. ఇప్ప‌టికే ఆ రెండు భాష‌ల్లో ఐదారు సినిమాల్లో న‌టిస్తోంది. తాజాగా అమ్మ‌డు మ‌ల‌యాళంలో మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి రెడీ అయింది. ప్ర‌స్తుతం అక్క‌డ `బ్ర‌హ్మం` అనే సినిమాలో న‌టిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్..ఉన్ని ముకుంద‌న్..మ‌మ‌తామోహ‌న్ దాస్..రాశీఖ‌న్నా హీరో.. హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌వి. కె. చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాపై మాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి. పృథ్వీ మ‌ల్టీట్యాలెంటెడ్ గా వెలిగిపోతున్న స‌మ‌యంలో రిలీజ్ అవుతోన్న చిత్రం కావ‌డం విశేషం.

ఈ సినిమాతో రాశీకి మంచి గుర్తింపు దక్కుతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఇది మాలీవుడ్ లో అమ్మ‌డికి ఇది రెండ‌వ సినిమా. గ‌తంలో ఉన్ని కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విల‌న్ చిత్రంలో న‌టించింది. అందులో మోహ‌న్ లాల్ తో క‌లిసి తొలిసారి తెర‌ను పంచుకుంది. కానీ ఆ సినిమా అమ్మ‌డికి అవ‌కాశాలు తెచ్చిపెట్ట‌లేదు. దీంతో రాశీ అటుపై టాలీవుడ్ చిత్రాల‌తోనే బిజీ అయింది. ప్ర‌స్తుతం తెలుగులో మ్యాచ్ ఓ స్టార్ గోపీచంద్ క‌థ‌నాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` లో న‌టిస్తోంది. ఈ సినిమాని యూవీ క్రియేష‌న్స్..జీఏ2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అలాగే అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ . కె. కుమార్ తెర‌కెక్కిస్తోన్న `థాంక్యూ`లోనూ న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక త‌మిళ్ కార్తీ స‌ర‌స‌న `స‌ర్దార్` లో న‌టిస్తోంది. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే మ‌రో రెండు కోలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. అయితే ఆ ప్రాజెక్ట్ లు డిలే అవుతున్నాయి. క‌రోనా పాండ‌మిక్ నుంచి ఆ సినిమా షూటింగ్ లు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి.