Begin typing your search above and press return to search.

న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతంలో 'పుష్ప' టీమ్ మ‌కాం.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య షూటింగ్..?

By:  Tupaki Desk   |   3 Nov 2020 7:30 AM GMT
న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతంలో పుష్ప టీమ్ మ‌కాం.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య షూటింగ్..?
X
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ - అల్లు అర్జున్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం ముందుగా కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. అయితే ఇప్పుడు కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితులు కనిపించకపోవడంతో ఇక్కడే చిత్రీకరణ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావ‌రి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడానికి 'పుష్ప' టీమ్ సన్నాహకాలు చేసుకున్నారు.

నవంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్న నేపథ్యంలో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్ ఏరియాలో రిసార్ట్స్ కూడా బుక్ చేసుకున్నారని సమాచారం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నెల రోజుల పాటు డీప్ ఫారెస్ట్ లోనే షూటింగ్ చేయనున్నారు. దీని కోసం అల్లు అర్జున్ - రష్మిక మందన్న - సుకుమార్ సహా ఇతర తారాగణం మరియు సిబ్బంది షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా రిసార్ట్స్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అందులోనూ న‌క్స‌ల్స్ ప్ర‌భావిత అటవీ ప్రాంతం కావ‌డంతో తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీ సహాయంతో పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఈ సినిమా షూటింగ్ జ‌ర‌బోతుంద‌ట‌. కాగా, ఈ సినిమాలో 'పుష్ప రాజ్ అనే పాత్రలో నటించనున్నాడు. ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.