Begin typing your search above and press return to search.

'పుష్ప' మళ్లీ అక్కడకు వెళ్తున్నాడట!

By:  Tupaki Desk   |   1 Sep 2021 5:30 AM GMT
పుష్ప మళ్లీ అక్కడకు వెళ్తున్నాడట!
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్‌ 1 షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. రేపటి నుండి కొత్త షెడ్యూల్‌ ను షురూ చేసేందుకు గాను పుష్ప టీమ్‌ సిద్దం అయ్యింది. పుష్ప షూటింగ్ కోసం ఈ ఏడాది ఆరంభంలో మేరేడుమిల్లి ప్రాంతానికి సుకుమార్ టీమ్ వెళ్లడం జరిగింది. బన్నీపై పలు ఆసక్తికర సన్నివేశాలను అక్కడ చిత్రీకరించినట్లుగా ఆ సమయంలో యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. పుష్ప తర్వాత ఆచార్య కూడా అక్కడ షూటింగ్‌ చేసిన విషయం తెల్సిందే. పుష్ప టీమ్‌ మరోసారి మేరేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ కోసం వెళ్లారు.

ముందస్తుగానే ప్లాన్‌ చేసుకున్నారా లేదంటే మరో ప్రాంతం ను ఎంపిక చేసి అక్కడ వీలు లేకపోవడంతో మళ్లీ తెలియదు కాని నేడు యూనిట్‌ సభ్యులు అక్కడ ఏర్పాట్లలో మునిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ లు కూడా అక్కడకు వెళ్లబోతున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా మేరేడుమిల్లి షెడ్యూల్‌ తో దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు. ప్యాచ్‌ వర్క్‌ ఏమైనా ఉంటే ముగించి అక్టోబర్ లో సినిమాకు గుమ్మడి కాయ కొట్టడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పుష్ప సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ లో ముగించి డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. బన్నీ కి జోడీగా ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తుంది. వీరిద్దరు కూడా గతంలో ఎప్పుడు కనిపించనంత మాస్ గా.. రూరల్‌ లుక్‌ లో కనిపించబోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ మరియు రష్మికలు ముందుగానే భార్య భర్తలుగా కనిపిస్తారట. ఇద్దరి కాంబో సన్నివేశాలు రొమాంటిక్ మరియు ఎమోషనల్‌ గా ఉంటాయని అంటున్నారు.

పుష్ప మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండవ పార్ట్‌ మరింత భారీగా ఉండటంతో పాటు మరో లెవల్ అన్నట్లుగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. రెండవ పార్ట్‌ వచ్చే సమ్మర్ లో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప తో మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్‌ లోకి అడుగు పెడుతున్న అల్లు అర్జున్ పై అభిమానులు చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మరి పుష్ప ఆ నమ్మకంను నిలుపుకుంటుందా అనేది చూడాలి.