Begin typing your search above and press return to search.

పూరి ఏకంగా పుస్తకమే రాస్తున్నాడు

By:  Tupaki Desk   |   12 Dec 2015 1:41 PM GMT
పూరి ఏకంగా పుస్తకమే రాస్తున్నాడు
X
పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ లోఫర్ మరో నాలుగు రోజుల్లో సిల్వర్ స్క్రీన్స్ పైకి రానుంది. మెగా వారసుడు, నాగబాబు తనయుడు అయిన వరుణ్ తేజ్ కి మెగా ప్రిన్స్ అనే బిరుదు ఇచ్చి మరీ.. మాస్ హీరోగా చూపిస్తున్నాడు పూరీ. దీనికి ముందు ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా జ్యోతిలక్ష్మి. క్యూట్ కనిపించే హాట్ హీరోయిన్ ఛార్మి లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా... టైటిల్ నుంచే ఆకట్టుకుంది.

అంచనాలు ఎక్కువయిపోవడంతో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కావడంలో విఫలమైంది. ఈ మూవీని ఫ్లాప్ కింద ఇండస్ట్రీ జమ కట్టినా.. పూరీ మాత్రం ఒప్పుకోవడం లేదు. అసలు జ్యోతిలక్ష్మి విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, అద్భుతంగా తెరకెక్కిందని చెబ్తున్నాడు. అంతే కాదు.. ఇది నిరుత్సాహకరమైన ఫలితం ఇచ్చిందని కూడా ఒప్పుకోవడం లేదు. నిర్మాతలకు కూడా జ్యోతిలక్ష్మి డబ్బులు బాగానే సంపాదించి పెట్టింది అన్నాడు. ఈ మూవీ తర్వాత చాలామంది మహిళలకు, తనపై గౌరవం పెరిగిందని, ఆ విషయం స్వయంగా చెప్పారంటున్నాడు పూరీ. ఇక్కడితో ఆగిపోలేదు లెండి. ప్రస్తుతం జ్యోతిలక్ష్మి స్టోరీ, ప్రయాణం, ఆ సినిమా కాస్టింగ్, ప్రొడక్షన్, తెరకెక్కించిన తీరు, అనుభవాలపై ఓ పుస్తకం కూడా తీసుకొస్తున్నానని చెప్పాడు పూరీ జగన్నాధ్.

అన్ని రకాల కండిషన్స్, లిమిటేషన్స్ ఉన్న సినిమాల్లోనే పూరీ ఖతర్నాక్ డైలాగ్స్ రాస్తాడు. మరి భావజాలానికి హద్దు లేని సాహిత్యంలో ఇంకెన్ని వండర్స్ చేయబోతున్నాడో అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అంతేకాదు.. ఇప్పటివరకూ ఇన్ని మూవీస్ తీసిన పూరీ.. జ్యోతిలక్ష్మి పైనే పుస్తకం రాయాలని అనుకోవడానికి ప్రత్యేక కారణం ఏమై ఉంటుందబ్బా అని తెగ ఆలోచించుకుంటున్నారు.