Begin typing your search above and press return to search.

డిస్ర్టిబ్యూటర్లపై కేస్‌ పెట్టిన పూరి జగన్‌

By:  Tupaki Desk   |   16 April 2016 10:02 PM IST
డిస్ర్టిబ్యూటర్లపై కేస్‌ పెట్టిన పూరి జగన్‌
X
మొన్నక రోజున సడన్‌ గా పోలీస్‌ స్టేషన్‌ లో కనిపించాడు పూరి జగన్‌. అయితే ఎందుకు వచ్చావ్‌ బాబూ.. ఏసిపి నా ఫ్రెండ్‌ కాబట్టి.. ఊత్తినే ఆయన్ను కలవడానికి వచ్చాడు అని చెప్పాడు. దానిలో నిజమెంతో ఇప్పుడు తెలిసింది. తన ఫ్రెండును తన ఆఫీసులోనే కలవొచ్చుగా.. స్టేషన్‌ వరకూ రావాలేంటి అనే సందేహం చాలామందికి వచ్చుండొచ్చు.

ఇప్పుడు ఆ సందేహాలను నిజం చేస్తూ.. అసలు పూరి ఎందుకు వెళ్ళాడో తెలుస్తోంది. మ్యాటర్‌ ఏంటంటే.. ఎప్పుడైతే జ్యోతిలక్ష్మి, లోఫర్‌ వంటి సినిమాలు ఫెయిల్‌ అయ్యాయో.. అప్పటినుండి కొంతమంది పంపిణీదారులు తనను వేధిస్తున్నారట. ఈయన ఆఫీస్‌.. కేవ్‌.. కు వచ్చి గోల గోల చేస్తున్నారట. నీ తదుపరి సినిమాల రైట్స్ మాకు ఇస్తావా ఇవ్వవా అంటూ బ్లాక్‌ మెయిల్‌చేస్తున్నారని పూరి తన కంప్లయింట్‌ లో పేర్కొన్నారు. ఈ కంప్లయింట్‌ లో ఆయన అభిషేక్‌.. సుధీర్‌.. ముత్యాల రామదాసు అనే ముగ్గురు డిస్ర్టిబ్యూటర్ల గురించి ప్రస్తావించారు.

దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారట.