Begin typing your search above and press return to search.

పూరి కొత్త పాఠం.. బాబాలు గురువులకు తెలియని 'మిస్టరీ లైఫ్‌'

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:20 AM GMT
పూరి కొత్త పాఠం.. బాబాలు గురువులకు తెలియని మిస్టరీ లైఫ్‌
X
లాక్ డౌన్ సమయంలో డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాద్‌ జీవితంకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్‌ చేసేందుకు గాను పూరీ మ్యూజింగ్స్‌ ద్వారా షేర్‌ చేశాడు. ఇప్పటి వరకు ఎన్నో విషయాలను షేర్‌ చేసిన పూరీ కొత్త పాఠంను చెప్పేందుకు సిద్దం అయ్యాడు. మిస్టరీ లైఫ్‌ గురించి పూరి కొత్త విషయాలను తనకు అనిపించిన విషయాలను షేర్‌ చేశాడు. జీవితం అంటే ఏంటీ.. జీవితం పరమార్థం ఏంటీ అనే విషయాలను గురించి పూరి జగన్నాద్‌ చెప్పిన కొత్త పాఠం ఆలోచింపజేసే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. పూరి మిస్టరీ లైఫ్‌ మ్యూజింగ్స్ లో జరిగిన యదార్థ సంఘటనలు మరియు జీవితంలో ఎదుర్కొనే విషయాలను గురించి చెప్పబోతున్నాడట.

మిస్టరీ లైఫ్‌ గురించి చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. వాటి గురించి స్వాములు.. బాబాలు.. గురువులు ఇలా ఏ ఒక్కరు చెప్పలేక పోతున్నారు. చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్న ప్రశ్నలకు తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా యోగ ధ్యానం చేయాలంటూ సూచిస్తూ ఉంటారు. లైఫ్‌ అనేది పెద్ద మిస్టరీ. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం.. దాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం టైమ్ వేస్ట్‌ పని. జీవితాన్ని గురించి ఆలోచించడం మానేసి జీవితాన్ని జీవించాలంటూ పూరి సూచించాడు. మొత్తానికి జీవితం గురించి పూరి మాటల్లో వింటూ ఉంటే ఒక తెలియని ఉత్సాహం ఏదో కలుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ 'లైగర్‌' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. లైగర్ సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. వచ్చే ఏడాది వరకు ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ ను బాక్సింగ్ నేపథ్యంలో పూరి చూపించబోతున్నాడు. బాలీవుడ్‌ కరణ్‌ జోహార్‌ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అవ్వడంతో ఈ సినిమాపై పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్‌ క్రియేట్‌ అయ్యింది. పాన్‌ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.