Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసుపై సోద‌రి సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   17 Jan 2023 10:38 AM GMT
సుశాంత్ కేసుపై సోద‌రి సంచ‌ల‌నం!
X
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌దంగా 2020 జూన్ 14న ముంబైలోని త‌న అపార్ట్ మెంట్ లో మృతి చెందిన విష‌యం తెలిసిందే. సుశాంత్ త‌న అపార్ట్ మెంట్ లోని గ‌దిలో ఉరివేసుకుని మృతి చెందిన‌ట్లుగా పోలీసులు దృవీక‌రించారు. అప్ప‌టి నుంచి ఈ కేసు న‌డుస్తోంది. ఈ కేసుని సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే సుశాంత్ ఎంతో ప్రాణంగా పెంచుకున్న పెంపుడు శున‌కం ఫ‌డ్జ్ తాజాగా మ‌రణించింది. ఈ విష‌యాన్ని సుశాంత్ సోద‌రి ప్రియాంకా సింగ్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది.

ఫ‌డ్జ్.. నువ్వు స్వ‌ర్గంలో వున్న ఈ స్నేహితుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒక రోజు మిమ్మ‌ల్ని అనుస‌రిస్తాం. అప్ప‌టి వ‌ర‌కు మాకు ఈ బాధ త‌ప్ప‌దు. గుండె ముక్క‌ల‌య్యింది' అంటూ భావోద్వేగఆనికి లోన‌వుతూ ట్వీట్ చేసింది.

అంతే కాకుండా సుశాంత్ , ఫ‌డ్జ్ క‌లిసి వున్న ప‌లు ఫొటోల‌తో పాటు ఓ వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో నెటిజ‌న్ లు స్పందించ‌డం మొద‌లు పెట్టారు. విచారం వ్య‌క్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

త‌మ య‌జ‌మాని మృతి చెందిన త‌రువాత పెంపుడు జంతువులు కూడా శాశ్వ‌తంగా వుండ‌వు. సుశాంత్ మ‌ర‌ణించిన త‌రువాత ఫ‌డ్జ్ అత‌ని కోసం చాలా ఎదురు చూసింది. ఈ న‌ష్టం భ‌రించ‌లేనిది..మీరు ధైర్యంగా వుండండి. మిమ్మ‌ల్ని ఓదార్చేందుకు మాకు మాట‌లు రావ‌డం లేదు' అంటూ ఓదారుస్తున్నారు. ఇదిలా వుంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మ హ‌త్య కాద‌ని.. అత‌నిది హ‌త్యేన‌ని కుటుంబ స‌భ్యుల‌తో పాటు, అభిమానులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

వారి ఆరోప‌ణ‌లని నిజం చేస్తూ సుశాంత్ సింగ్ ని పోస్ట్ మార్ట‌మ్ చేసిన సిబ్బందిలోని ఓ వ్య‌క్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. సుశాంత్ బాడీని చూసిన వెంట‌నే ఇది ఆత్మ హ‌త్య కాదు హ‌త్య అని చెప్పాన‌ని కూప‌ర్ హాస్పిట‌ల్ లో పోస్ట్ మార్ట‌మ్ చేసిన వ్య‌క్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో సుశాంత్ మృతిపై మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌స్తుతం ఈ కేసుని సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా సుశాంత్ సోద‌రి ప్రియాంకా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుని ఉద్దేశ పూర్వ‌కంగానే జాప్యం చేస్తున్నార‌ని, ఆ కార‌ణంగానే ఈ కేసులో జార్జీషీట్ ని దాఖ‌లు చేయ‌డానికి ఆల‌స్యం చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రియాంక సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ప్ర‌స్తుతం త‌ను చేసిన ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.