Begin typing your search above and press return to search.

గత్యంతరం లేక పెళ్లికి రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   15 Feb 2016 10:30 PM GMT
గత్యంతరం లేక పెళ్లికి రెడీ అవుతోంది
X
హీరోయిన్లు ప్రేమిస్తే తప్పు లేదు కానీ.. ఆ ప్రేమను బయటపెట్టడమే పెద్ద తప్పని డస్కీ బ్యూటీ ప్రియమణికి చాలా లేటుగా జ్నానోదయం అయింది. తెలుగులో కెరీర్ ముగిసిపోయినా.. కన్నడలో ఓ మోస్తరు అవకాశాలతో ఏడాది కిందటి వరకు బాగానే బండి నడిపిస్తూ వచ్చింది ప్రియమణి. కానీ ముస్తఫా రాజ్ అనే బిజినెస్ మేన్ ను అప్పటికి రెండేళ్ల ముందు నుంచే ప్రేమిస్తూ వచ్చిన ప్రియమణి.. గత ఏడాది ఏదో ఎగ్జైట్ మెంట్ లో అతడితో ప్రేమాయణం గురించి మీడియాకు చెప్పేసింది. తామిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇక అంతే సంగతులు.. ప్రియమణి సినిమాల్లో కొనసాగదేమో అని.. కొనసాగినా ఆమెతో సినిమాలు చేయడం కష్టమే అని ఓ నిర్ణయానికి వచ్చేసి ఆమెకు ఆఫర్లు ఆపేశారు దర్శక నిర్మాతలు.

దీంతో చేతిలో సినిమాల్లేక ఖాళీ అయిపోయింది మలయాళ కుట్టి. తన ప్రేమ గురించి బయటపెట్టి తప్పు చేశానంటూ ఆ మధ్య ఆవేదన కూడా వ్యక్తం చేసిన ప్రియమణి.. ఇక ఎలాగూ ఖాళీనే కాబట్టి పెళ్లి చేసుకుని సెటిలైపోవాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది ముస్తఫా రాజ్ ను పెళ్లాడబోతున్నట్లు కూడా ప్రకటించేసింది. ఈ మధ్య కేరళకే చెందిన అసిన్ మైక్రో మ్యాక్స్ యజమానుల్లో ఒకడైన రాహుల్ ను పెళ్లాడి జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ముస్తఫా రాజ్ కు అంత స్థాయి లేకపోయినా.. అతనూ బాగా ఉన్నవాడే. ముస్తఫా ను ప్రియమణి ఓ డ్యాన్స్ షోలో తొలిసారి కలిసింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. గత ఏడాది నుంచి వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.