Begin typing your search above and press return to search.

ఐదేళ్ల తర్వాత ‘ప్రేమమ్’ డైరెక్టర్ కొత్త మూవీ..!

By:  Tupaki Desk   |   20 Dec 2020 6:30 AM GMT
ఐదేళ్ల తర్వాత ‘ప్రేమమ్’ డైరెక్టర్ కొత్త మూవీ..!
X
‘ప్రేమమ్...’ 2015 లో మలయాళంలో రూపొందిన ఈ మూవీ సంచలనం విజయం సాధించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లు సాధించింది. మలయాళ స్టార్ నివిన్ పౌలీ, హీరోయిన్లు సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికి కుదిరింది..

ఈ చిత్రం విడుదలై ఐదేళ్లు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మెగా ఫోన్ పట్టని దర్శకుడు అల్ఫోన్స్.. తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశాడు. ‘పాట్టు’ (పాట) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెెక్కించబోతున్నట్టు ప్రకటించాడు అల్ఫోన్స్. ఈ చిత్రంలో టాప్ స్టార్స్ ఫహద్ ఫాసిల్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు వివరాలను తన ఆన్‌లైన్ పేజీలో వెల్లడించిన అల్ఫోన్స్.. ఈ చిత్రానికి తాను మ్యూజిక్ కూడా అందించనున్నట్లు ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రకటించారు. “నా తదుపరి చలన చిత్రానికి పాట్టు (పాట) అని పేరు పెట్టాం. ఫహద్ ఫాసిల్ ఈ చిత్రానికి హీరో. అయితే.. ఈసారి నేను మ్యూజిక్ కూడా చేయబోతున్నాను. మలయాళ భాషలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, టెక్నీషియన్ల గురించి త్వరలో వెల్లడిస్తా’’ అని పోస్ట్ చేశారు.

మళయాలంలో అల్ఫోన్స్ తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని 2016లో తెలుగులో నాగచైతన్య హీరోగా చందు మొండేటి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా అలరించారు. అతిథిపాత్రల్లో ఈ స్టార్ హీరోలు నటించారు. అయితే.. ఈ చిత్రం మళయాలం మాతృక స్థాయి విజయాన్ని తెలుగులో అందుకోలేకపోయింది.