Begin typing your search above and press return to search.

వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న 'ప్రేమమ్' బ్యూటీ...?

By:  Tupaki Desk   |   27 July 2020 1:30 AM GMT
వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న ప్రేమమ్ బ్యూటీ...?
X
రాబోయే రోజుల్లో కూడా వెబ్ సిరీస్ ల హవా ఇలానే కొనసాగుతుందని అని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ ల నిర్మాణంలో పాలుపంచుకుంటూ వెబ్ వరల్డ్ లో అడుగులు పెట్టేసారు. స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చాలామంది స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. తెలుగులో కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ ల నిర్మాణం ఊపందుకుంది. ఈ క్రమంలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి రెడీ అవుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కాగా మణిరత్నం నవరసాల ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించే ప్లాన్ లో ఉన్నారట. నాలుగు భాషల్లో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ లోని తొమ్మిది స్టోరీలను తొమ్మిది మంది స్టార్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టోరీకి దర్శకత్వం వహించడానికి వెట్రిమారన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు. అంతేకాకుండా వెట్రి మారన్ తెరకెక్కించబోయే స్టోరీ పరువు హత్యల నేపథ్యంలో ఉండబోతోందని.. అందులో ప్రకాష్ రాజ్ - సాయి పల్లవి తండ్రీకూతుళ్లుగా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్యతో 'లవ్ స్టోరీ'.. దగ్గుబాటి రానాతో 'విరాటపర్వం' సినిమాల్లో నటిస్తోంది సాయి పల్లవి. మరి సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి వెబ్ సిరీస్ లో నటించబోతోందనే వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.