Begin typing your search above and press return to search.

టెస్టులో నెగెటివ్ వ‌స్తుంద‌ని బావురుమన్న మ‌హేష్ హీరోయిన్

By:  Tupaki Desk   |   17 Sep 2020 4:30 PM GMT
టెస్టులో నెగెటివ్ వ‌స్తుంద‌ని బావురుమన్న మ‌హేష్ హీరోయిన్
X
ఎర‌క్క‌పోయి దుబాయ్ వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటా ప్ర‌స్తుతం భ‌యంతో వ‌ణికిపోతోంది. ఐపీఎల్ మెగా లీగ్ 2020 ఈ నెల 19న ప్రారంభం కాబోతోంది. యుఏఈ వేదిక‌గా ఈ టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందు కోసం ప్రీతీ జింటా ఇప్ప‌టికే ఆకాశ‌హార్మ్యాల‌ దుబాయ్ చేరుకుంది. షార్జా వేదిక‌గా 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ టోర్నీ ప్రారంభానికి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే మిగిలి వుండ‌టంతో అంద‌రితో పాటు ప్రీతీజింటా కూడా టెన్ష‌న్ ప‌డుతోంది.

ఆమె పంజాబ్ జ‌ట్టుకు స‌హ య‌జ‌మానిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కోవిడ్ కారణంగా విదేశీ ఆట‌గాళ్ల‌ని బ‌యో బ‌బుల్ వాతావ‌ర‌ణంలో వుంచుతున్నారు. యుఏఈ వాతావ‌ర‌ణం వారికి అల‌వాటు ప‌డ‌టం కొంత క‌ష్టంగా మారింది. దీంతో జ‌ట్టు యామాన్యాలు వారికి ప్ర‌త్యేక ఏర్పాట్టు చేస్తున్నారు. ఇందు కోసం వారం క్రిత‌మే లాస్ ఏంజిల్స్ నుంచి ప్రీతీ యుఏఈకి చేరుకుంది. ప్ర‌స్తుతం హోట‌ల్ క్వారెంటైన్ లో వుంటోంది.

ఇటీవ‌లే ఆమెకు కోవిడ్ టెస్టులు నిర్వ‌హించారు. రెండు టెస్టుల్లోనూ ప్రీతికి నెగెటివ్ వ‌చ్చింది. ఫైన‌ల్ టెస్ట్ ని త్వ‌ర‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. ఫైన‌ల్ టెస్ట్ ‌లో ఏమోస్తుందో అని ప్రీతి జింటా తెగ కంగారుప‌డుతోంద‌ట‌. ఈ సంద‌ర్భంగా ఆసక్లిక‌ర‌మైన పోస్ట్ ‌ని చేసింది. రేప‌టితో నా క్వారెంటైన్ గ‌డువు ముగుస్తోంది. క‌రోనా టెస్ట్ వుంది. చాలా భ‌యంగా వుంది. ఎవ‌రినీ క‌ల‌వ‌క‌పోయినా ఏదో మూల చిన్న భ‌యం న‌న్ను వెంటాడుతోంది. ఖ‌చ్చితంగా రిజ‌ల్ట్ నెగ‌టివ్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను` అని పోస్ట్ చేసింది. ప్రీతి గురించి తెలిసిన వాళ్లంతా ఎర‌క్క‌పోయి వ‌చ్చింది ఇరుక్కుపోయింది అంటూ కామెంట్‌లు చేస్తున్నార‌ట‌.