Begin typing your search above and press return to search.

కెజీఎఫ్ డైరెక్టర్ నెక్స్ట్.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   9 Sep 2019 7:23 AM GMT
కెజీఎఫ్ డైరెక్టర్ నెక్స్ట్.. ఏం జరుగుతోంది?
X
యష్ హీరోగా తెరకెక్కించిన 'కె.జీ.ఎఫ్: చాప్టర్ 1' తో భారీ విజయం సాధించి సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. 'కె.జీ.ఎఫ్' ఒక ప్యాన్ ఇండియన్ ఫిలిం గా విజయం సాధించడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా సంగతి ఓకే కానీ ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రంపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం జరిగిందని.. నెక్స్ట్ సినిమా గురించి ఇద్దరి మధ్య చర్చలు సాగాయని సమాచారం. ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో మహేష్ ను మెప్పించాడట. 'కె.జీ.ఎఫ్' తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందని.. దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని అంటున్నారు. ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే మహేష్ ఈ సినిమాను స్వయంగా నిర్మించేందుకు రెడీగా ఉన్నాడట.

అంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ వారు 'కె.జీ.ఎఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ తో తమ బ్యానర్ లోనే ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ - మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాకు ప్రయత్నాలు సాగుతుంటే మైత్రీ - ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనట్టు.. అసలేం జరుగుతోందబ్బా..?