Begin typing your search above and press return to search.

రేపు ఉదయం 'టైటిల్'తో థ్రిల్ చేస్తానంటున్న యంగ్ డైరెక్టర్!!

By:  Tupaki Desk   |   7 Aug 2020 4:56 PM GMT
రేపు ఉదయం టైటిల్తో థ్రిల్ చేస్తానంటున్న యంగ్ డైరెక్టర్!!
X
కరోనా భయంతో ఇండస్ట్రీలో సినిమాల షూటింగ్స్ ప్రారంభించడానికి అందరూ భయపడుతున్నారు. సినిమాల షూటింగ్స్, బుల్లితెర షూటింగ్స్ జరుపుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరూ కూడా ధైర్యం చేయడం లేదు. కొందరు స్టార్ట్ చేసినా పరిస్థితి చూసి నిలిపేశారు. ప్రస్తుతం ఆర్జీవీ తరువాత లాక్ డౌన్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్న డైరెక్టర్ ఒకరున్నారని అంత అనుకుంటున్నారు. ఆ యంగ్ డైరెక్టరే ప్రశాంత్ వర్మ. కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూ కేవలం కథను నమ్మి ముందుకు సాగుతున్నాడు ప్రశాంత్. తన ఫస్ట్ సినిమా ‘అ!’ తోనే విమర్శకుల నుండి ప్రశంసలు పొందిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత ‘కల్కి’ చిత్రంతో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ అందించాడు.

ప్రస్తుతం మూడో ప్రయత్నంగా కరోనా వైరస్ ఆధారంగా సినిమా తీస్తున్నాడు. మెడికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ కరోనా టైంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఫినిష్ చేస్తున్నాడట. ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తయినదని సమాచారం. తన ప్రతి సినిమాలో సస్పెన్సు థ్రిల్లింగ్ ఫీల్ కలిగిస్తున్న ప్రశాంత్.. ఈ సినిమాను కూడా అదే జోనర్ లో అందిస్తాడని అంచనా వేస్తున్నారు. పోస్టర్ల తోనే ఆసక్తి రేపుతున్న ప్రశాంత్ రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తానని ప్రకటించాడు. ఇక థ్రిల్లర్ డ్రామాగా కరోనా పై సినీ ప్రేక్షకులకు అవగాహన కలిగించే విధంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక అదే విధంగా ఆగస్టు 15న ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే ప్లాన్ కూడా చేసినట్లు సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. చూడాలి మరి రేపు ఎలాంటి టైటిల్ తో ప్రశాంత్ థ్రిల్ చేయనున్నాడో..!