Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 22 ప్ర‌క‌ట‌న‌తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్

By:  Tupaki Desk   |   18 Aug 2020 3:30 AM GMT
ప్ర‌భాస్ 22 ప్ర‌క‌ట‌న‌తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్
X
డార్లింగ్ ప్ర‌భాస్ వ‌రుస‌గా షాక్ ల‌ మీద షాక్ లిస్తున్నాడు. మొన్న‌టికి మొన్న నాగ్ అశ్విన్-అశ్వ‌నిద‌త్ బృందంతో క‌లిసి ప్ర‌భాస్ 21 ప్ర‌క‌ట‌న వెలువ‌రించ‌గానే అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. నిప్పు పొగ‌ లేకుండానే.. ఇంత స్పీడ్ చూపించాడు! అంటూ ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్ర‌భాస్ 21లో క‌థానాయిక‌గా దీపిక ప‌దుకొనేని ఎంపిక చేసి ఆ వెంట‌నే మ‌రో షాకిచ్చారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో మునుపెన్న‌డూ చూడ‌ని విజువ‌ల్ ఫీస్ట్ ని తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

తాజాగా మ‌రో ఊహించ‌ని షాక్. గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ డార్లింగ్ ప్ర‌భాస్ తో ఓ సినిమాని చేయ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఎట్ట‌కేల‌కు అది కాస్తా అధికారికంగా క‌న్ఫామ్ అయ్యింది. ప్ర‌భాస్ 22 వ చిత్రాన్ని ఓంరౌత్ తెర‌కెక్కిస్తారు. దీనిపై తాజా ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు. `A- ఆదిపురుష్` పేరుతో భారతదేశంలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేంత‌ అత్యంత భారీగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. A అనే సింగిల్ లెట‌ర్ టైటిల్ అంత‌ర్జాతీయ రిలీజ్ ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఆదిపురుష్ క‌థాంశం `రామాయణం` ఇతిహాసంపై ఆధారపడిన‌ది. ప్రభాస్ అందులో రాముడి పాత్రను పోషించనున్నారు. 3 డి ఫార్మాట్ ‌లో .. హైఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో నెవ్వ‌ర్ బిఫోర్ విజువ‌ల్ ఫీస్ట్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ 2021 లో సెట్స్ పైకి వెళ్లి.. 2022 లో విడుద‌ల‌వుతుంది ప్రధాన విల‌న్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ న‌టుల‌ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఈ చిత్రం హిందీ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్క‌నుంది. అంతర్జాతీయంగా విడుదల కోసం అనేక విదేశీ భాషల్లోకి అనువ‌దించ‌నున్నారు. దీంతో పాటు తమిళం..మలయాళం .. కన్నడ భాషలలో కూడా అనువ‌దించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఓమ్ రౌత్ నిర్మాణ సంస్థ సహకారంతో టీ-సిరీస్ కు చెందిన భూషణ్ కుమార్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దాదాపు 500కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చించ‌నున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.