Begin typing your search above and press return to search.

మరోసారి 'డార్లింగ్' అనిపించుకున్న ప్రభాస్.. ఏం చేశాడంటే??

By:  Tupaki Desk   |   15 Jan 2021 12:04 PM GMT
మరోసారి డార్లింగ్ అనిపించుకున్న ప్రభాస్.. ఏం చేశాడంటే??
X
డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తుండటంతో అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ నిజానికి ఫ్యాన్స్ నిరాశలోనే ఉన్నారని సమాచారం. ఎందుకంటే మిగతా స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే రాధేశ్యామ్ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ ఇంతవరకు టీజర్ రాలేదు. ఇప్పటికే మిగతా సినిమాలు రిలీజ్ డేట్స్, టీజర్స్ విడుదల చేసేసారనే నిరాశలో ఉన్నారట ఫ్యాన్స్. కానీ లేట్ అయినా లేటెస్ట్ గా అలరిస్తాం అంటున్నారు మేకర్స్. సాహో లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమా పై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా లాక్ డౌన్ ముందే యూరప్ షెడ్యూల్‌ను ముగించుకుంది.

పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ 1960ల కాలంనాటి ప్రేమికుల నేపథ్యంలో రూపొందుతుందట. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో తెలుగే కాకుండా బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా ఐదు బాషలలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన మనసు చాటుకున్నాడు. సంక్రాంతి సందర్బంగా రేయిపగలు రాధేశ్యామ్ కోసం కష్టపడుతున్న చిత్రబృందానికి ఖరీదైన చేతి గడియారాలను గిఫ్ట్ గా ఇచ్చాడట. యూనిట్ మొత్తానికి ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు, యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. యూవి క్రియేషన్స్ అండ్ గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది.