Begin typing your search above and press return to search.

నేటితో త‌న క‌ల‌ల్లో ఒక‌టి నెర‌వేరింద‌న్న ప్ర‌భాస్

By:  Tupaki Desk   |   19 Feb 2022 4:30 AM GMT
నేటితో త‌న క‌ల‌ల్లో ఒక‌టి నెర‌వేరింద‌న్న ప్ర‌భాస్
X
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆదిపురుష్ 3డి.. స‌లార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు సంబంధించిన త‌న పార్ట్ షూటింగ్ ని శ‌ర‌వేగంగా ముగించి ఇప్పుడు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ప్రాజెక్ట్ కే చిత్రీక‌ర‌ణ‌లో ప్ర‌భాస్ పాల్గొంటున్నారు.

ఇక ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా.. అంత‌కుముందే త‌న క‌ల నిజ‌మైంది! అంటూ ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు ప్ర‌భాస్. అత‌డికి ఇది ఉత్కంఠ రేపే ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్. భార‌తీయ సినిమా లెజెండరీ నటులలో ఒకరైన అమితాబ్ బచ్చన్ తో నేడు ప్రభాస్ ప్రాజెక్ట్ K మొదటి షాట్ ను పూర్తి చేసారు.

అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ ను పంచుకునే ఏ నటుడికైనా ఇది అరుదైన అవ‌కాశం. జీవితకాల జ్ఞాపకంగా నిలుస్తుంది. ప్రభాస్ దీనికి మినహాయింపు కాదు. అతను ఎంతో ఎగ్జ‌యిట్ అవుతూ ఇలా వ్యాఖ్యానించారు. ``నేటితో నాకు ఒక కల నిజమైంది. లెజెండరీ అమితాబ్ బచ్చన్ సర్ తో ఈరోజు # ప్రాజెక్ట్ మొదటి షాట్ ను పూర్తి చేసాను`` అంటూ ప్ర‌భాస్ ఆనందం వ్య‌క్తం చేసారు. 1975 నాటి `దీవార్` చిత్రం నుండి అమితాబ్ లుక్ ని కూడా ప్ర‌భాస్ షేర్ చేసారు.

సేమ్ టైమ్ బిగ్ బి అమితాబ్ కూడా ప్రాజెక్ట్ K గురించి ప్ర‌భాస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యానాన్ని ట్వీట్ చేశారు. ``బాహుబలి ప్రభాస్ తో మొదటి రోజు మొదటి షాట్.. పూర్త‌యింది. సూపర్ స్టార్ ప్రభాస్ నమ్రతతో పాటు అతని నటన సౌరభం చూసాను. నేర్చుక‌నేందుకు చాలా ఉంది!`` అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి డార్లింగ్ ప్ర‌భాస్ కి ఇది లైఫ్ టైమ్ మెమ‌రీ.

ఇలాంటి అరుదైన అవ‌కాశం త‌న‌కు ద‌క్కింది అంటే అది బాహుబ‌లి తెచ్చిన గౌర‌వం. జ‌క్క‌న్న లాంటి ద‌ర్శ‌క‌ధీరుడు త‌న‌కు ఇచ్చిన వ‌రం అని చెప్పాలి. ఇక న‌టుడిగా ఎంతో హార్డ్ వ‌ర్క్ తో జాతీయ స్థాయిలో ప్ర‌జ‌లంద‌రినీ అభిమానులుగా మ‌లుచుకున్న గొప్ప స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయి నుంచి ఇక‌పై పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. హాలీవుడ్ కి ధీటైన కంటెంట్ తో దూసుకెళ్లే ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌భాస్ ఉన్నాడు. ప్రాజెక్ట్ కే ఆ త‌ర‌హా సినిమానే అని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కుముందు దీపిక ప‌దుకొనే సైతం ఇండియాలో ఒక డిఫ‌రెంట్ మూవీ తెర‌కెక్కుతోంద‌ని ఆన్ లొకేష‌న్ నుంచి కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే.