Begin typing your search above and press return to search.

'ప్రభాస్ 21' సినిమాని పాన్-ఇంటర్నేషనల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారా...?

By:  Tupaki Desk   |   9 May 2020 1:00 PM GMT
ప్రభాస్ 21 సినిమాని పాన్-ఇంటర్నేషనల్ మూవీగా ప్లాన్ చేస్తున్నారా...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తుండగా ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలతో పాటు అవార్డులను కూడా పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా నాగ్ అశ్విన్ అదే స్థాయిలో అద్భుతంగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటి దాకా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారబోతున్నాడు. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా జోనర్ ఏమిటనేది మేకర్స్ బయటికి చెప్పకున్నప్పటికీ ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని సమాచారం. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట.

ఇటీవల వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంభందించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఈ సినిమాని కొన్ని వందల కోట్లతో భారీ స్థాయిలో నిర్మించబోతున్నామని చెప్పుకొచ్చాడట. అంతేకాకుండా ఈ సినిమాకు స్టార్ కాస్టింగ్ సైతం భారీగా ఉండనుందట. పాన్ ఇంటర్నేషనల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ యాక్టర్స్ ని ఈ సినిమా కోసం తీసుకోనున్నారట. అలాగే వివిధ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి హాలీవుడ్ టెక్నిషియన్స్ ని తీసుకోనున్నారట. ప్రస్తుత పరిస్థితులలో విదేశాల నుండి టెక్నిషియన్స్ తీసుకురావడం కష్టమైనప్పటికీ ఈ సినిమా స్టార్ట్ అయ్యే లోపు అన్ని సర్దుకుంటాయని చిత్ర బృందం భావిస్తోందట. ప్రభాస్ ఈ సినిమా కోసం రెండేళ్లు డేట్స్ కేటాయించనున్నాడట. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించనున్నారని సమాచారం. వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు పొందే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నది. యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని.. సున్నితమైన ప్రేమకథలా తెరక్కుతున్న ఈ మూవీలో ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉండబోతున్నాయని సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.