Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా షూటింగ్ ఆగిపోయిందా...?

By:  Tupaki Desk   |   18 March 2020 8:30 AM GMT
ప్రభాస్ సినిమా షూటింగ్ ఆగిపోయిందా...?
X
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా, 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ అర్ధాంతరంగా ఆపివేసి చిత్ర బృందం జార్జియా నుండి ఇండియాకి తిరిగి వచ్చారని సమాచారం. కరోనాని కూడా పట్టించుకోకుండా తాము షూట్ చేస్తున్నామని దర్శకుడు రాధాకృష్ణ ఇంతకముందు ట్విట్టర్ లో అప్డేట్స్ కూడా పెట్టాడు. మరి ఇప్పుడు ఎందుకు షూటింగ్ ఆపేసారు అనే విషయం గురించి రకరకాలుగా ఇండస్ట్రీలో చర్చింకుంటున్నారు. అయితే ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాధాకృష్ణ దీని గురించి క్లారిటీ ఇచ్చాడు.

మార్చి 31 వరకు యూరప్ మరియు ఇతర దేశాల నుండి విమానాలను అనుమతించబోమని భారత ప్రభుత్వం ప్రకటించడం తో చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్ ను తగ్గించుకొని తిరుగు ప్రయాణమయ్యామని తెలిపారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే నెల 25న ఉగాది సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి 'జాన్', 'ఓ డియర్', 'రాధే శ్యామ్', అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటున్న ఈ సమయంలో, దసరాకి కేజీఎఫ్ 2 విడుదల కానుండడం తో చిత్ర యూనిట్ ఏం చెయ్యబోతున్నారనేది వేచి చూడాలి. కథను అనేక మలుపులు తిప్పి ప్రేక్షకులను కట్టి పడెయ్యాలనుకున్న సాహో సినిమా, తను వేసుకున్న ముళ్లల్లో తానే చిక్కుకుని బోర్లా పడిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు.