Begin typing your search above and press return to search.

ఆరెఫ్సీ లోనే ప్రభాస్ కు రూమ్ ఇచ్చారట!

By:  Tupaki Desk   |   25 Aug 2018 8:42 AM GMT
ఆరెఫ్సీ లోనే ప్రభాస్ కు రూమ్ ఇచ్చారట!
X
స్టార్లను చూసి చాలామంది అసూయపడుతుంటారు. కానీ అదే స్టార్లు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో.. ఎన్నిటికి దూరంగా ఉంటారో మాత్రం పట్టించుకోరు. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు 'సాహో' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. 'సాహో' తాజా షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ తో పాటుగా 'సాహో' లో పని చేసే ఇతర నటులకు అక్కడే వసతి ఏర్పాటు చేశారట. సినిమా షూటింగ్ పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకూ..ఒక్కోసారి రాత్రిదాకా సాగుతోందట.. ఇలాంటప్పుడు నటులు రోజూ సిటీనుంచి ఆరెఫ్సీ కు ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకో తెలుసు కదా. ఆ ట్రాఫిక్ లో ఒక రోజు అలా వెళ్తే రెండు రోజు ఇక షూటింగ్ కు వెళ్ళడానికి ఓపిక ఉండదు. అందుకే 'సాహో' టీం ఇలాంటి ఏర్పాటు చేశారట. వారానికి ఒకసారి మాత్రం వాళ్ళు ఇంటికి వెళ్ళి రావొచ్చట. ఇన్డైరెక్ట్ గా చెప్తే యూవీ క్రియేషన్స్ వారు బాహుబలి ని రామోజీలో నుండి బయటకు పోకుండా కట్టడి చేసినట్టే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముకేష్ మరో కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.