Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ కోసం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ కి నో చెప్పాడా?

By:  Tupaki Desk   |   23 Aug 2020 5:00 AM GMT
ఆదిపురుష్ కోసం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ కి నో చెప్పాడా?
X
ఒకే ఒక్క ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌భాస్ స్థాయి అమాంతం ప‌దింత‌లైంది. తానాజీ 3డి సినిమాతో సంచ‌ల‌నాల‌కు తెర‌తీసిన ఓం రౌత్ తో `ఆదిపురుష్ 3డి` అనే భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించేందుకు బాహుబ‌లి ప్ర‌భాస్ రెడీ అవుతున్నార‌న్న వార్త అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇది తన మొదటి హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం కావ‌డంతో డార్లింగ్ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్ల బ‌డ్జెట్ ని టీసిరీస్ ఖ‌ర్చు చేస్తుండ‌గా.. అందులో స‌గం మొత్తాన్ని కేవ‌లం గ్రాఫిక్స్ కే వెచ్చించ‌నున్నారు.

2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే త‌దుప‌రి నాగ్ అశ్విన్ తో సినిమాని ప్రారంభిస్తాడు. ఒకే ఏడాదిలో రెండు సినిమాల చిత్రీక‌ర‌ణ‌ల్లో ప్ర‌భాస్ పాల్గొంటారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల వ‌ల్ల కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ని ప్ర‌భాస్ దూరం పెట్టాడా? అంటూ మ‌రో చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది.

నిజానికి ప్ర‌భాస్ కి ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ క‌థ వినిపించాడు. స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు. కానీ ఇంత‌లోనే డెసిష‌న్ ఛేంజ్ అయ్యింది. ఓం రౌత్ తో ఆదిపురుష్ 3డి ప్రాజెక్ట్ ఖాయం కాగానే.. ప్రశాంత్ నీల్ చిత్రాన్ని ప్ర‌భాస్ మర్యాదపూర్వకంగా తిరస్కరించారని తెలిసింది. అయితే ప్రభాస్-ప్రశాంత్ నీల్ చిత్రం పూర్తిగా క్యాన్సిల్ అయిన‌ట్టు కాద‌ట‌. కొంత గ్యాప్ త‌ర్వాత దానిపై చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రీక‌ర‌ణ అనంత‌రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు.