Begin typing your search above and press return to search.

పక్కా ప్లాన్ తో వెళ్తున్న ప్రభాస్...!

By:  Tupaki Desk   |   5 Sep 2020 1:30 AM GMT
పక్కా ప్లాన్ తో వెళ్తున్న ప్రభాస్...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం తిరిగి ప్రారంభం కానుంది. 'రాధే శ్యామ్' సెట్స్ పై ఉండగానే 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ ఇచ్చాడు ప్రభాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ నటించనుంది. సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవకుండానే ప్రభాస్ ''ఆదిపురుష్'' అనే స్ట్రెయిట్ హిందీ మూవీని అనౌన్స్ చేశాడు. 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని టీ - సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ - క్రిషన్‌ కుమార్‌ నిర్మించనున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న ఓం రౌత్‌ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే లీడ్ క్యాస్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో 'ఆదిపురుష్' ని చెప్పినట్లుగానే 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ వేసుకున్నారట. ఈ సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు తీసుకెళ్లి వీలైనంత త్వరగా గ్రీన్ మ్యాట్ మీద షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఆ తర్వాత అవుట్ డోర్ షూట్స్.. వీఎఫ్ఎక్స్ పనులు చూసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా 'ఆదిపురుష్' ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతుండటంతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని ముందుకు జరిపారని.. ప్రభాస్ 21వ సినిమాగా 'ఆదిపురుష్' రాబోతోందని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే నాగ్ అశ్విన్ కూడా ఫుల్ స్క్రిప్ట్ ని ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నాడట. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నిర్విరామంగా దీనిపై వర్క్ చేసిన నాగ్ అశ్విన్ త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ 'రాధే శ్యామ్' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 'ఆదిపురుష్' మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని సమాంతరంగా షూట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కాకపోతే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని ముందుగా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది 'రాధే శ్యామ్' ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. 2022లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మరియు 'ఆదిపురుష్' ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.