Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడా?

By:  Tupaki Desk   |   26 Dec 2022 6:34 AM GMT
ప్ర‌భాస్ మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మునుపున్న‌డూ లేనంత‌గా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ చేతిలో ఐదు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లున్నాయి. ఇందులో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్‌ రౌత్ తో చేస్తున్న 'ఆది పురుష్‌' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. మ‌రో మూడు సినిమాలు అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వున్నాయి. వీటి త‌రువాత‌ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ‌తో ప్ర‌భాస్ మ‌రో భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు.

'స్పిరిట్‌' పేరుతో అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి రానున్న ఈ మూవీని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది షూట్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇదిలా వుంటే ఇంత బిజీ షెడ్యూల్ లోనూ ప్ర‌భాస్ మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ కు తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం మూడు సినిమాల షూటింగ్ ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. 'కేజీఎఫ్‌'ఫేమ్ ప్రశాంత్‌నీల్ డైరెక్ట్ చేస్తున్న 'స‌లార్‌' షూటింగ్ ఎడింగ్ స్టేజ్ కి వ‌చ్చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ 85 శాతం పూర్త‌యింద‌ని రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మేక‌ర్స్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీతో పాటు టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె' కూడా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

వీటి మ‌ద్య‌లో ఫ్యాన్స్ వ‌ద్ద‌ని వారించిన ప్ర‌భాస్ హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో మారుతి సినిమాని అంగీక‌రించ‌డం.. చ‌క చ‌కా ప‌ట్టాలెక్కించడం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఎక్క‌డా బ్రేక్ లేకుండా సాగుతోంది.

ఇంత బిజీ షెడ్యూల్ లో వున్న ప్ర‌భాస్ 'స్పిరిట్'తో పాటు మ‌రో సినిమాని కూడా లైన్ లో పెట్ట‌డం ఫ్యాన్స్ ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఐదు ప్రాజెక్ట్ లు లైన్ లో వుండ‌గానే ప్ర‌భాస్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఈ ప్రాజెక్ట్ ని 2024లో సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ట‌. రీసెంట్ గా సుకుమార్ ఓ ఐడియాని ప్ర‌భాస్ కు చెప్ప‌డం.. అది త‌న‌కు బాగా న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌.

ది క‌శ్మీర్ ఫైల్స్‌, కార్తికేయ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని నిర్మించిన అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగ‌ర్వాల్ ఈ ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. ది క‌శ్మీర్ ఫైల్స్ డైరెక్ట‌ర్ వివేక్ అగ్నిహోత్రి స‌హ నిర్మాత‌గా వ్యవ‌హ‌రించే అవ‌కాశం వుందని, ఈ ప్రాజెక్ట్ కోస‌మే రీసెంట్ గా అభిషేక్ అగ‌ర్వాల్, వివేక్ అగ్నిహోత్రి.. సుకుమార్ తో క‌లిసి ఆ ఫొటోల‌ని మీడియాకు షేర్ చేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.