Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ చేయ‌లేని ప‌ని ప్ర‌భాస్ చేశార‌ట‌

By:  Tupaki Desk   |   4 April 2022 7:53 AM GMT
డైరెక్ట‌ర్ చేయ‌లేని ప‌ని ప్ర‌భాస్ చేశార‌ట‌
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల 'రాధేశ్యామ్‌' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఆయ‌న‌ చేతిలో ప్ర‌స్తుతం నాలుగు భారీ చిత్రాలున్నాయి. ప్ర‌శాంత్ నీల్ తో 'స‌లార్‌', ఓం రౌత్ తో 'ఆది పురుష్‌', నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ కె' , సందీప్ రెడ్డి వంగ తో 'స్పిరిట్‌' చిత్రాలున్నాయి. ఇందులో ఇప్ప‌టికే మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌' చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో భాగంగా వీఎఫ్ ఎక్స్ ప‌నుల్లో బిజీగా వుంది.

ఇక మిగ‌తా సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌నిపించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల హీరో ప్ర‌భాస్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే త‌ను ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సి వ‌చ్చిందో అస‌లు సీక్రెట్ ని హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ తాజాగా బ‌య‌ట‌పెట్టాడు.

ముందు ఈ చిత్రంలో ఓ కీ రోల్ వుంద‌ని, ఆ పాత్ర‌లో న‌టించ‌మ‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న‌ని గ‌త ఏడాది సంప్ర‌దించాడ‌ని, అయితే ఆ త‌రువాత ఈ మూవీ షూటింగ్ అనివార్య కార‌ణాల వ‌ల్ల పోస్ట్ కావ‌డంతో తాను మ‌రో సినిమాకు సైన్ చేశాన‌న్నారు. ఆ కార‌ణంగా 'స‌లార్‌'కు డేట్స్‌ కేటాయించ‌లేక‌పోయాను.

ఈ విష‌యం తెలిసి ప్ర‌భాస్ స్వ‌యంగా న‌న్ను సంప్ర‌దించాడు. సినిమాలోని కీల‌క పాత్ర‌లో మీరు ఖ‌చ్చితంగా న‌టించాల‌ని క‌న్విన్స్ చేశార‌ట‌. ప్ర‌భాస్ అలా అన‌డంతో మ‌రో మాట మాట్లాడ‌లేక పోయాన‌ని, వెంట‌నే 'స‌లార్‌' కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాన‌ని పృథ్వీరాజ్ సుకుమార‌న్ అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు.

అంటే డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ చేయ‌లేని ప‌నిని హీరో ప్రభాస్ ప్ర‌త్యేకంగా తీసుకుని చేశార‌న్న మాట‌. కోల్ మాఫియా నేప‌థ్యంలో సాగే హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని 'కేజీఎఫ్‌' ఫేమ్ హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ తో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ 30 శాతం వ‌ర‌కు పూర్త‌యింది.

అయితే ప్ర‌భాస్ కు ఈ మూవీ షూటింగ్ లో గాయం అయిన కార‌ణంగా డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు స్పెయిన్ లో ప్ర‌త్యేకంగా మైన‌ర్ స‌ర్జ‌రీ చేయించుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు రెండు నెల‌ల పాటు డాక్ట‌ర్లు ప్ర‌భాస్ ని విశ్రాంతి తీసుకోమాన్నార‌ట‌. ప్ర‌భాస్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ మ‌రోసారి వాయిదాప‌డ‌టం గ‌మ‌నార్హం. షూటింగ్ ఆల‌స్యం అవుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ కూడా మ‌రింత వెన‌క్కి వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.