Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ క్రేజీ లైన‌ప్‌.. ఇన్నెప్పుడు చేస్తాడ‌బ్బా?

By:  Tupaki Desk   |   7 Nov 2022 9:35 AM GMT
ప్ర‌భాస్ క్రేజీ లైన‌ప్‌.. ఇన్నెప్పుడు చేస్తాడ‌బ్బా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మునుపెన్న‌డూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. 'బాహుబ‌లి'తో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించిన ప్ర‌భాస్ ఆ త‌రువాత చేసిన రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్‌ల‌తో అభిమానుల్ని తీవ్రంగా నిరాశ‌కు గురిచేశాయి. కోట్లల్లో న‌ష్టాల‌ని తెచ్చిపెట్టాయి. అయినా స‌రే ప్ర‌భాస్ తో సినిమాలు చేస్తామంటూ నిర్మాత‌లు,ద‌ర్శ‌కులు పోటీప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నాడు.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆది పురుష్‌' ని చేస్తున్నారు. పౌరాణిక గాధ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ముందు చేసిన వీఎఫ్ ఎక్స్ వర్క్ పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు త‌లెత్త‌డంతో చిత్ర బృందం మ‌ళ్లీ ఇందు కోసం రూ. 100 కోట్ల‌ని కేటాయించి పూర్తి స్థాయి ప‌ర్ ఫెక్ష‌న్ తో వీఎఫ్ ఎక్స్ సీన్ ల‌ని స‌రికొత్త దీర్చి దిద్ద‌బోతోంది.

దీంతో సినిమా రిలీజ్ ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రికి కాకుండా జూన్ 16కు పోస్ట్ పోన్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ప్ర‌భాస్ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో 'స‌లార్‌', నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె'లో న‌టిస్తు్న విష‌యం తెలిసిందే. ఈ రెండు భారీ ప్రాజెక్ట్ లు అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే ప్ర‌భాస్ మ‌రో ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే.

మారుతి డైరెక్ష‌న్ లో సినిమా వ‌ద్ద‌ని అభిమానులు వారిస్తున్నా ప్ర‌భాస్ మాత్రం ముందుకే వెళుతున్నాడు. రీసెంట్ గా మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ ప్రారంభ‌మైంది. ఈ మూడింటికే ప్ర‌భాస్ డైట్స్ అడ్జెస్ట్ కావ‌డం లేదంటే 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగ తోనూ 'స్పిరిట్‌' పేరుతో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇవి విని అభిమానులు షాక్ అవుతున్నార‌ట‌. అంగీక‌రించిన సినిమాలు చేయ‌డానికే డేట్స్ కుద‌ర‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మ‌రో ప్రాజెక్టా? అని అభిమానులు షాక్ కు గుర‌వుతున్నార‌ట‌. బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధార్ధ్ ఆనంద్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని, మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురానున్నాయ‌ని, యువీ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం షారుఖ్ ఖాన్ తో 'ప‌ఠాన్‌' మూవీని తెర‌కెక్కిస్తున్న సిద్ధార్ధ్ ఆనంద్ ఈ మూవీకి రూ. 80 కోట్ల మేర రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా ప్ర‌భాస్ ఇన్నెప్పుడు చేస్తాడ‌బ్బా? అని వాపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.