Begin typing your search above and press return to search.

శృతి హాసన్ కు ప్రభాస్ అభినందనలు.. ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   9 Sep 2022 5:21 PM GMT
శృతి హాసన్ కు ప్రభాస్ అభినందనలు.. ఎందుకంటే..?
X
విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా చిత్ర సీమలో అడుగుపెట్టిన శృతి హాసన్.. హీరోయిన్ గా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. శృతి చిన్నతనం నుంచే మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. చిన్న వయసులోనే సింగర్‌ గా ప్రయాణాన్ని మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌ లను రూపొందించింది. తన తండ్రి నటించిన 'ఈనాడు' చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించింది.

గతంలో 'ఎడ్జ్' అనే మ్యూజిక్ వీడియోతో ఆకట్టుకున్న శృతి హాసన్.. ఇప్పుడు ''షీ ఈజ్ ఎ హీరో'' అనే మరో స్పెషల్ వీడియో సాంగ్ తో ముందుకు వచ్చింది. శ్రుతి ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా లిరిక్స్ రాసి పాడింది. ఈ సింగిల్‌ లో ఆమెతో పాటుగా ప్రముఖ రాపర్ MC అల్తాఫ్ కూడా ఉన్నాడు. కరణ్ కంచన్ మరియు కరణ్ పరేఖ్ ఈ పాటను నిర్మించారు. మోహిత్ ముఖి & గిచ్ దర్శకత్వం వహించారు.

'షీ ఈజ్ ఎ హీరో' వీడియో సాంగ్ ని సెప్టెంబర్ 9న శృతి హాసన్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పాటని షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'షీ ఈజ్ ఎ హీరో' అనే కొత్త వీడియో సాంగ్‌ ని లాంచ్ చేసిన సందర్భంగా శృతి హాసన్ కు అభినందనలు. మొత్తం టీమ్ ఇన్క్రెడిబుల్ వర్క్ చేసింది అని ప్రభాస్ పేర్కొన్నారు.

ప్రభాస్ మరియు శ్రుతి హాసన్ ప్రస్తుతం ''సలార్'' అనే సినిమాలో హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక శృతి హాసన్ ‘షీ ఈజ్ ఎ హీరో’ సాంగ్ విషయానికొస్తే.. ఇది మహిళల పోరాటాలు మరియు విజయాలను సంబరాలపై దృష్టి పెడుతుంది. దీనికి నిరంజన్ అయ్యంగార్ అదనపు సాహిత్యం అందించగా.. శిక్షా సేవా ఫౌండేషన్‌ టీమ్ ఈ పాట కోసం పనిచేశారు.

''మహిళల పోరాటాలు మరియు విజయాలపై వెలుగునిచ్చేందుకు 'షీ ఈజ్ ఎ హీరో' విభిన్న కళాకారులను.. కళా ప్రక్రియల మిశ్రమాన్ని ఒకచోట చేర్చింది. డొమైన్‌ తో సంబంధం లేకుండా గాంభీర్యం మరియు ధైర్యసాహసాలతో వారు చేసే ప్రతి పనిలోనూ పైకి ఎదుగుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల శక్తివంతమైన కథలకు ఈ పాట ఒక గీతం'' అని మేకర్స్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఆ మధ్య సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్న శృతి హాసన్.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. 'క్రాక్' 'వకీల్ సాబ్' విజయాల తర్వాత క్రేజీ అవకాశాలను చేజ్కిక్కించుకుంటోంది. ప్రస్తుతం 'సలార్' తో పాటుగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK107 లో నటిస్తోంది శృతి. అలానే 'వాల్తేరు వీరయ్య' సినిమాలో