Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ ఆ రెంటిలో ఏది ముందు క్లారిటీ వచ్చేసింది

By:  Tupaki Desk   |   9 Sep 2020 12:30 AM GMT
ప్రభాస్‌ ఆ రెంటిలో ఏది ముందు క్లారిటీ వచ్చేసింది
X
బాహుబలి స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం తన చేతిలో వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే మూడు సినిమాలను పెట్టకున్నాడు. ఇండియాలో ఇప్పటి వరకు ఒకేసారి వెయ్యి కోట్ల విలువ చేసే సినిమాల్లో నటించిన ఘనత ఎవరికి దక్కలేదు. మొదటి సారి ప్రభాస్‌ కు ఆ ఘనత దక్కింది అనడంలో సందేహం లేదు. ఈమూడు సినిమాల్లో మొదటగా రాధే శ్యామ్‌ సినిమాను ప్రభాస్‌ పూర్తి చేయబోతున్నాడు. ఈ ఏడాది చివరి వరకు రాధే శ్యామ్‌ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత వచ్చే ఏడాదిలో ఆదిపురుష్‌ మరియు నాగ్‌ అశ్విన్‌ ల సినిమాను చేయబోతున్నాడు.

నాగ్‌ అశ్విన్‌ మూవీ ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. ఇటీవల ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌ మూవీ ప్రకటన వచ్చింది. దర్శకుడు ఓం రౌత్‌ సినిమాను 2021 ఆరంభంలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో నాగ్‌ అశ్విన్‌ సినిమా విషయంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ కు హ్యాండ్‌ ఇచ్చాడా ఏంటీ అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రభాస్‌ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు సినిమాలను కూడా ప్రభాస్‌ వచ్చే ఏడాది చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

జనవరి 2021 నుండి ఆదిపురుష్‌ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు ఎక్కువగా గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉంటుందట. కేవలం మూడు నుండి నాలుగు నెలల షూటింగ్‌ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత కనీసం ఏడాది పాటు గ్రాఫిక్స్‌ వర్క్ చేయాల్సి ఉంటుందట. ఏప్రిల్‌ లేదా మే వరకు ఆది పురుష్‌ ను పూర్తి చేసి ఆ వెంటనే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మూవీని ప్రభాస్‌ చేయబోతున్నాడట. రెండు సినిమాలు కూడా రెండు మూడు నెలల గ్యాప్‌ లోనే 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 2022లో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ ను షేక్‌ చేయడం ఖాయం అంటూ ఇప్పటి నుండే ఆయన అభిమానులు మరియు సన్నిహితులు నమ్మకంగా వెయిట్‌ చేస్తున్నారు.