Begin typing your search above and press return to search.

మరింత ఆలస్యం అవ్వనున్న ప్రభాస్‌ అశ్విన్‌ మూవీ

By:  Tupaki Desk   |   13 Dec 2020 7:38 AM GMT
మరింత ఆలస్యం అవ్వనున్న ప్రభాస్‌ అశ్విన్‌ మూవీ
X
ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ పూర్తి అయిన వెంటనే నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని మొదట అధికారిక ప్రకటన వచ్చింది. 2020 ఆరంభంలో ప్రభాస్‌ మూవీని పట్టాలెక్కించేందుకు నాగ్‌ అశ్విన్‌ ప్రయత్నాలు చేశాడు. ఈ సమయంలోనే ఆదిపురుష్‌ మూవీని ఓంరౌత్‌ ప్రకటించి 2020 ఆరంభంలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో సమ్మర్‌ లో నాగ్‌ అశ్విన్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం వచ్చింది. ఇంతలో ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ ను ప్రకటించాడు.

కేజీఎఫ్‌ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాక ముందే ప్రభాస్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌ నుండి అనధికారిక ప్రకటన వచ్చేసింది. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మూవీ ని వెంటనే చేస్తాడని అనుకుంటే ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు రెండు సినిమాలను ప్రభాస్‌ చేయబోతున్నాడు. దాంతో నాగ్‌ అశ్విన్‌ మూవీ వచ్చే ఏడాది చివరి వరకు ప్రారంభం అయ్యేది లేనిది క్లారిటీ లేకుండా పోయింది.

అశ్వినీత్‌ భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రభాస్‌ వేరే సినిమాలకు కమిట్‌ అవుతున్న కారణంగా నాగ్‌ అశ్విన్‌ మూవీ ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది రాధేశ్యామ్‌ సినిమా విడుదల కానుండగా 2022లో ఆదిపురుష్‌ మరియు సలార్‌ లు విడుదల అవ్వనుండగా 2023లో నాగ్‌ అశ్విన్‌ మూవీ తో ప్రభాస్‌ వచ్చే అవకాశం ఉంది.