Begin typing your search above and press return to search.

పూజాహెగ్డేతో 'డార్లింగ్' రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట..!

By:  Tupaki Desk   |   11 April 2020 10:53 AM GMT
పూజాహెగ్డేతో డార్లింగ్ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట..!
X
'డార్లింగ్' ప్రభాస్ పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్' - 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చారు. 'బాహుబలి' తరువాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ 'సాహో' తో పలకరించాడు. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరింది. తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో మాత్రం సాహో సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో ఆయన రాధాకృష్ణతో తీస్తున్న మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా సున్నితమైన ప్రేమకథలా తెరక్కుతున్న ఈ మూవీలో ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయట. ప్యూర్ అండ్ సెన్సిబుల్ లవర్స్ గా కనిపించే ప్రభాస్ - పూజాహెడ్గేల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందట. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కంట తడిపెట్టించడం ఖాయమని అనుకుంటున్నారు. ప్రభాస్ 'డార్లింగ్' సినిమా తరువాత ఓ పూర్తి స్థాయి లవ్ ఎంటర్ టైనర్ తీస్తున్నారు. ఆ తర్వాత అన్ని సినిమాలలో యాక్షన్ ఉండేలా చూసుకున్న ప్రభాస్ ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడట. అయితే కరోనా మహమ్మారి ఇండియాలో అడుగు పెట్టకపోయుంటే ఈ పాటికే టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చేసేవే. కాకపోతే దేశమంతా ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు మూవీ ప్రమోషన్స్ చేసుకోవడం భావ్యం కాదని భావించిన చిత్ర బృందం దీన్ని వాయిదా వేసుకున్నారు. ఏదేమైనా చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ తీస్తున్న లవ్ స్టోరీ కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.