Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌'లో కృతిని తీసుకోడానికి కారణం ఆ స్టార్ హీరోయేనట..!

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 PM GMT
ఆదిపురుష్‌లో కృతిని తీసుకోడానికి కారణం ఆ స్టార్ హీరోయేనట..!
X
పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ కాంబినేషన్ లో 3డీ లో ''ఆదిపురుష్‌'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ క్రమంలో సీత పాత్రల్లో నటించే హీరోయిన్ అంటూ అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అందరూ అనుకుంటున్నట్లే సీతాదేవి పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని ఫైనలైజ్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1-నేనోక్కడినే' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి సనన్.. నాగ చైతన్యతో చేసిన 'దోచేయ్' సినిమా తర్వాత టాలీవుడ్ కి దూరమైంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ బ్యూటీని 'ఆదిపురుష్' ఫ్యామిలీలోకి తీసుకోడానికి బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కారణమని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఓం రౌత్ తో 'తన్హాజీ' సినిమా చేసిన అజయ్.. ఇప్పుడు కృతి స‌న‌న్ ని ప్ర‌భాస్ సినిమాకు రిక‌మెండ్ చేశాడట. మ‌రి కృతి మీద అజ‌య్ దేవ‌గ‌న్ అంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణమేంటో తెలియదు కానీ 'ఆదిపురుష్'లో సీత‌గా ఈ బ్యూటీని తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.