Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 21 మెగాస్టార్ విన్న క‌థేన‌ట‌!

By:  Tupaki Desk   |   9 March 2020 5:07 AM GMT
ప్ర‌భాస్ 21  మెగాస్టార్ విన్న క‌థేన‌ట‌!
X
యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఇటీవ‌లే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో స‌డెన్ గా సినిమాని ప్ర‌క‌టించి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బ‌డ్జెడ్ తో పాన్ ఇండియా కేట‌గిరిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌భాస్ 20 చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యాక సెట్స్ కి వెళ‌తారు. ఇక అశ్విన్ తో కెరీర్ 21వ చిత్రం చేస్తున్నారు. అస‌లు ఈ కాంబోలో సినిమా ఉంటుంద‌ని క‌నీసం ఊహ‌కి కూడా అంద‌లేదు. సోష‌ల్ మీడియా సైతం ఆ విష‌యాన్ని గెస్ చేయ‌లేక‌పోయింది. ఇంకా ఆ షాక్ నుంచి పూర్తిగా తేరుకోనేలేదు. ఈలోగానే ర‌క‌ర‌కాల అప్ డేట్స్ వేడెక్కించేస్తున్నాయి.

నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ వెన‌క చాలా మ‌త‌ల‌బు ఉంద‌ని తాజాగా కొన్ని లీకులు అందాయి. ఇంత‌కు ముందు
మెగాస్టార్ చిరంజీవి తో చేయాల‌ని సిద్ధం చేసిన స్క్రిప్టునే చివ‌రి నిమిషంలో ప్ర‌భాస్ వైపుకు మ‌ళ్లించాడ‌ని ఓ ప్ర‌చారం ఇంకా వైర‌ల్ అవుతూనే ఉంది. మ‌రి ఇందులో నిజం ఎంత‌ అన్న‌ది రివీల్ కావాల్సి ఉంది ఇక ఈ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ ప్ర‌క‌టించాడు. ప్ర‌భాస్ పాన్ ఇండియా ఇమేజ్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా యువ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించనున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రింత అప్ డేట్ అందింది.

ఇదో ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్ మాపియా క‌థ‌తో తెర‌కెక్క‌నుంది. ప్ర‌మాద‌క‌ర‌ స్టెరాయిడ్ల బిజినెస్.. ఈ వ్యాపారంలో దందాల నేప‌థ్యం లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సైన్స్ ఫిక్ష‌న్ క‌థ ఇద‌ని తెలుస్తోంది. సినిమా ఓ రియ‌లిస్టిక్ ఎక్స్ పీరియ‌న్స్ ని ఇచ్చేలా స్క్రిప్ట్ ని సిద్దం చేసారుట‌. అలాగే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు .. థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ కి కొద‌వుండ‌ద‌ట‌. వైవిధ్య‌మైన‌.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టేలా ఈ మూవీని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. అలాగే ఈ సినిమాకు కూడా సాహో త‌ర‌హాలోనే టాప్ రేంజ్ హాలీవుడ్ టెక్నిషియ‌న్లు ప‌నిచేయ‌నున్నారుట‌. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జూన్ నుంచి మొద‌లు కానున్నాయి. ఆ ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేప్ప‌టికి జాన్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న జాన్ ని పూర్తి చేసేస‌రికి డిసెంబ‌ర్ వ‌చ్చేస్తుంది. అనంత‌రం నాగ్ అశ్విన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.