Begin typing your search above and press return to search.

పోసాని.. టచ్‌ చేశావయ్యా!!!

By:  Tupaki Desk   |   17 July 2015 5:02 PM GMT
పోసాని.. టచ్‌ చేశావయ్యా!!!
X
ఇప్పుడు హైదారబాద్‌లో ప్రత్యూష అనే అమ్మాయి గురించి తెలియనివారు ఉండేరేమో. ఎల్‌.బి.నగర్‌కు చెందిన ఈ 18 ఏళ్ళ అమ్మాయిని గత సంవత్సరంన్నరగా ఆమె తండ్రి, సవతి తల్లి బాగా టార్చర్‌ పెట్టి ఇంట్లోనే నిర్భందించేశారు. యాసిడ్‌తో వళ్ళు కాల్చి, ముఖం మీద గాయలు చేసి, చివరకు పిచ్చిదని చుట్టుపక్కల వారికి చెబుతూ ఆమెను నానా విధాలు చిత్రహింసలు పెట్టేశారు. ఒక చైల్డ్‌ రైట్స్‌ యాక్టివిష్టు ఈమెను ఈ నరకం అనబడే ఇంటి నుండి విముక్తిపరిచి రెస్క్యూ హోమ్‌లో పెట్టించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ అమ్మాయికి సాయం అందించడానికి చాలామంది ముందుకొస్తున్నారు. మన పాపులర్‌ యాక్టర్‌ పోసాని కృష్ణమురళి కూడా అందులో ఒకరు. ఆ అమ్మాయికి సకల చదువులు చదివించడానికి అయ్యే ఖర్చుతో పాటు జీవితాంతం ఆమెకు కావల్సిన సకల వనరులను నేను సమకూరుస్తాం అంటూ రాజా ముందుకొచ్చాడు. అసలు ప్రత్యూష్‌ స్థితి చూడగానే పోసానికి గుండె తరుక్కుపోయి ఏడుపు వచ్చేసిందట. అలాంటి పేరెంట్స్‌ ను వెంటనే ఉరేసి చంపేయాలి అంటూ పోసాని ఉద్విగ్నంగా సెలవిచ్చాడు. ఆయన మనస్సు చూస్తుంటే లవ్‌ యు రాజా అని చెప్పక తప్పదు. టచ్‌ చేశాడంతే.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అసలు ఎవరితో మాట్లాడాలన్నా కూడా ప్రత్యుష ప్రస్తుతం భయపడుతోంది. సొంత తండ్రే రెండో భార్య తన కన్న కూతురిని చిత్రహింసలు పెడుతుంటే నవ్వుతూ ఆనందించినవాడు.. అందుకే ఎవర్ని నమ్మాలో తెలియని పరిస్థితి ఆమెది. ప్రస్తుతం ట్రమాటిక్‌ సెంటర్‌వారు ఆమెకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి రికవర్‌ అయ్యాక.. ఆమె ఎవరి సాయం తీసుకుంటుంది అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఇకపోతే నరరూప రాక్షసుడు అయిన ఆమె తండ్రిని అటెంప్ట్‌ టూ మర్డర్‌ కేసులో బుక్‌ చేసి లోపలేశారులే.