Begin typing your search above and press return to search.

బ్లాక్ మ్యాజిక్ చేస్తూ కుర్రాళ్ల‌ను కంపెనీల‌ను వ‌ల్లో వేస్తోంది

By:  Tupaki Desk   |   12 July 2021 4:43 AM GMT
బ్లాక్ మ్యాజిక్ చేస్తూ కుర్రాళ్ల‌ను కంపెనీల‌ను వ‌ల్లో వేస్తోంది
X
పూజా హెగ్డే రెగ్యుల‌ర్ ఫోటోషూట్లు ప్ర‌స్తుతం అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాయావి ద‌య వ‌ల్ల‌ బుట్ట బొమ్మగా పాపుల‌ర‌య్యాక ఈ అమ్మ‌డు ఎందులోనూ త‌గ్గ‌డం లేదు. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో థై సొగ‌సుల్ని వ‌డ్డిస్తూ అదిరిపోయే భంగిమ‌ల్ని పూజా షేర్ చేసింది. పూజా టోన్డ్ బాడీని ఈ బ్లాక్ మ్యాజిక‌ల్ డ్రెస్ ఎంతో గొప్ప‌గా ఎలివేట్ చేస్తోంది. దీనిని యోగా ఫార్ములా ప్ర‌కారం కిల్ల‌ర్ వ‌జ్రాస‌న భంగిమ‌..! అని పిల‌వాలేమో. `నీదైన‌ మ్యాజిక్ ని నువ్వు న‌మ్ముకో!` అంటూ పూజా ఈ ఫోటోల‌కు అదిరిపోయే క్యాప్ష‌న్ ని ఇచ్చింది.
ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

మ‌రోవైపు పూజా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. రాధేశ్యామ్ - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్- ఆచార్య‌ చిత్రాలు రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా విజ‌య్ స‌ర‌స‌న బీస్ట్ లో న‌టిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్క‌నున్న చిత్రానికి పూజా కాల్షీట్ల‌ను కేటాయించ‌నుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే పూజాతో సంప్ర‌దింపులు పూర్త‌య్యాయ‌ని అయితే తేదీల కేటాయింపు పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ లో ప్రారంభ‌మ‌వుతుంది. అప్ప‌టికి పూజాకు కొంత వెసులుబాటు క‌లుగుతుంద‌నే భావిస్తున్నారు. పూజాతో నిర్మాత ఠాగూర్ మ‌ధు మంత‌నాలు సాగిస్తున్నారు. పూజా క‌థ విని సంతృప్తి చెందింది. సృజనాత్మక అంశాలు న‌చ్చాయి. షూటింగ్ షెడ్యూల్ నిర్ధారించబడిన తర్వాత పూజా షెడ్యూళ్ల వివ‌రాల్ని వెల్లడిస్తారు.

మ‌రోవైపు పూజా త‌దుప‌రి మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో నాయిక‌గా న‌టించేందుకు సంతకం చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రానికి పూజా హెగ్డే సంత‌కం చేసింది. కాల్షీట్ల‌ను బ‌ట్టి నితిన్ చిత్రాన్ని అంగీకరించనుంద‌ని చెబుతున్నారు.

ఇక ఇటీవ‌ల‌ షూటింగ్ లు ప్రారంభం కావ‌డంతో పూజా హెగ్డే త్వరలో బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్ షెడ్యూళ్ల‌తో బిజీ కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూజా హెగ్డే న‌టించే వాటిలో హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో మూడు సినిమాలు చేస్తోంది. సమంతా తరువాత పూజా హెగ్డే త్రివిక్రమ్ సొంత‌ బ్యానర్ లో ఫేవ‌రెట్ నాయికగా మారినట్లు తెలుస్తోంది.