Begin typing your search above and press return to search.

ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడాలిః పూజా హెగ్డే

By:  Tupaki Desk   |   5 May 2021 4:38 AM GMT
ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడాలిః పూజా హెగ్డే
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం కరోనా కారణంగా హోమ్‌ క్వారెంటైన్ లో ఉన్న విషయం తెల్సిందే. మెల్లగా కోలుకుంటున్నట్లుగా ఆమె ఇటీవలే చెప్పుకొచ్చింది. కరోనా క్వారెంటైన్ లో ఉన్నా కూడా పూజా హెగ్డే రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్‌ చాట్ జాతీయ మీడియా సంస్థలకు ఆన్ లైన్‌ ద్వారా ఇంటర్వ్యూలు ఇస్తూ.. లైవ్ కు వస్తు సందడి చేస్తూనే ఉంది. ఎప్పటికంటే ఇప్పుడు ఆమె చాలా యాక్టివ్‌ గా ఉందంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల ఒక చిట్‌ చాట్ లో పూజా హెగ్డే మాట్లాడుతూ.. కరోనా వల్ల చేతిలో పలు సినిమాలు ఉన్నా కూడా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక బాలీవుడ్‌ లో సల్మాన్ ఖాన్‌ తో సినిమా ఓకే అయినా కరోనా కారణంగా ఇప్పటి వరకు మొదలు కాలేదని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఈద్‌ కు సినిమా ను విడుదల చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదు. సల్మాన్‌ ఖాన్‌ తో షూటింగ్‌ సమయంలో ఎన్నో విషయాలను మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. నేను ఆయన్ను ఎంతగా అభిమానించానో చెప్పేందుకు ఎదురు చూస్తున్నాను. ఆయనతో చాలా మాట్లాడాలి ఆ సమయం ఎప్పుడు వస్తుందో అంటూ ఆసక్తిగా ఉన్నాను అంది.

తెలుగులో ఈమె నటించిన రాధేశ్యామ్‌ మరియు మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక ఆచార్య సినిమా లో కూడా ఈమె చరణ్‌ కు జోడీగా గెస్ట్ రోల్‌ లో కనిపించింది. ప్రస్తుతం పలు కమిట్‌ మెంట్‌ లు టాలీవుడ్‌ లో ఈమెకు ఉన్నాయి. మరో వైపు తమిళంలో సుదీర్ఘ కాలం తర్వాత ఈమె విజయ్‌ తో నటించబోతుంది. బాలీవుడ్‌ లో సల్మాన్ ఖాన్‌ తోనే కాకుండా యంగ్‌ స్టార్‌ హీరో రణవీర్‌ సింగ్‌ తో కూడా ఒక సినిమా లో నటిస్తుంది. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా కూడా కరోనా కారణంగా ఈమె పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడం విచారకరం అంటూ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.