Begin typing your search above and press return to search.

మన బుట్ట బొమ్మకు కేన్స్ గౌరవం

By:  Tupaki Desk   |   11 May 2022 3:30 PM GMT
మన బుట్ట బొమ్మకు కేన్స్ గౌరవం
X
టాలీవుడ్ లో హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌ మరియు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్‌ లో ఇటీవలే వచ్చిన బీస్ట్‌ సినిమాతో ఈమె సక్సెస్ దక్కించుకుని అక్కడ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇక హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ఒక సినిమా చేస్తూ మరో రెండు సినిమాలకు కూడా కమిట్‌ అయ్యింది.

మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీ స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచిన పూజా హెగ్డే భాష తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుని స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంటుంది. అందుకే ఈ అమ్మడికి దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం దక్కింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈమెకు ఇండియా నుండి హాజరు అయ్యేందుకు ఆహ్వానం అందింది.

గతంలో ఇండియన్ స్టార్స్‌ ఎంతో మంది కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ ఎంతో మందికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంచి పేరు గుర్తింపు తెచ్చి పెట్టాయి అనడంలో సందేహం లేదు. అలాంటి కేన్స్ ఫెస్టివల్‌ లో పాల్గొనే అవకాశం రావడంతో పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మే 17 మరియు 18వ తారీకున ఈ అమ్మడు కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఇండియా తరపున పాల్గొనడం మాత్రమే కాకుండా అక్కడ ఇండియన్‌ సినిమా యొక్క గొప్పతనంను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు గాను ఆమె సిద్దం అవుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ఇటీవలే రాధేశ్యామ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చిన కూడా ఆ సినిమాలోని పాత్ర తో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆచార్య సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది. ఇక మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఈ అమ్మడు నటించబోతున్న విషయం తెల్సిందే. ఇక బాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఈ అమ్మడు చేస్తోంది.