Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బాల్కనీలో సామజవరగమన!

By:  Tupaki Desk   |   6 April 2020 5:30 PM GMT
ఫోటో స్టోరీ: బాల్కనీలో సామజవరగమన!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ఎవరు అని అడిగితే తడుముకోకుండా పూజా హెగ్డే అని చెప్పాల్సి ఉంటుంది. పోయినేడాది 'గద్దలకొండ గణేష్' తో మెప్పించిన ఈ భామ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' సినిమాతో ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.

నిన్నరాత్రి భారతదేశంలో దాదాపుగా అందరూ ప్రధాని నరేంద్ర మోడీగారి పిలుపు మేరకు 9 గంటల సమయంలో 9 నిముషాల పాటు దీపాలు వెలిగించారు. పూజా హెగ్డే కూడా అందరిలాగే తన ఇంటి బాల్కనీలో దీపాలు వెలిగించి మాయదారి కరోనాపై తను కూడా పోరాటానికి సిద్ధం అన్నట్టుగా సంకేతం ఇచ్చింది. ఈ సందర్భంగా దీపాలతో ఒక చక్కని ఫోటో తీయించుకుని తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "దీపం. ప్రార్థన. మంచి ఆలోచనలు. ఎలాంటి క్లిష్టమైన సమయాల్లో అయినా దీపం వెలిగిస్తే సంతోషం కలుగుతుందని గుర్తుంచుకోండి. #9 బజే 9 మినిట్ #పవర్ ఆఫ్ పాజిటివిటీ" అంటూ ఓ సూపర్ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలో వైట్ కలర్ టాప్.. డెనిమ్ మిడ్డీ ధరించి.. చిరునవ్వులు చిందిస్తూ.. దీపం వెలిగిస్తున్నట్టుగా పోజిచ్చింది. మిలియన్ డాలర్ స్మైల్ అంటూ ఉంటారు చూడండి.. పూజా ఫేస్ చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తోంది. ఈ ఫోటోకు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఒక లైక్ వేసుకుంది. పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ప్రభాస్ 'జాన్' లో నటిస్తోంది.