Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌నే హ్యాక్ చేశారు ఇప్పుడెలా?

By:  Tupaki Desk   |   28 May 2020 4:30 AM GMT
బుట్ట‌బొమ్మ‌నే హ్యాక్ చేశారు ఇప్పుడెలా?
X
మ‌హ‌మ్మారీ వేళ ర‌క‌ర‌కాల ప‌రిణామాలు ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. అందులో హ్యాకింగ్ ఒక‌టి. నిత్యం హ్యాక‌ర్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఇందులో సామాన్యులు మాన్యులు అనే తేడా ఏం లేదు. సెల‌బ్రిటీల‌కు ఈ ముప్పు కాస్త ఎక్కువే. అస‌లు తాజా లాక్ డౌన్ ప‌రిణామంతో ప‌ని లేకుండా ఇంత‌కుముందే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. శోభ‌న‌.. క‌రీనా క‌పూర్.. ఊర్వ‌శి రౌతేలా.. ఒక‌రేమిటి ఎంద‌రినో హ్యాక‌ర్లు వేధించారు. వీరి సోష‌ల్ మీడియాల్ని హ్యాక్ చేసి నానా ర‌చ్చ చేశారు. ఇప్పుడు హ్యాకింగ్ మ‌రింత పెచ్చు మీరింది.

టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే కి తాజాగా ఈ ప‌రిస్థితి ఎదురైంది. పూజా చాలా కాలంగా ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంది. అక్క‌డ వేడెక్కించే ఫోటోషూట్లు .. వీడియో షూట్ల‌ను ఎలాంటి దాపరికం లేకుండా పోస్ట్ చేస్తూ.. ఇప్ప‌టికే లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఇంకా అక్క‌డ రెగ్యుల‌ర్ అప్ డేట్స్ తో వేడెక్కిస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. కానీ ఇంత‌లోనే ఆకస్మికంగా ఈ బుధ‌వారం రాత్రి తన ఇన్ స్టా ఖాతా హ్యాక్ అయ్యింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే ఈ విష‌య‌మై తన డిజిట‌ల్ బృందానికి సమాచారం ఇచ్చినట్లు పూజా తెలిపింది. ఆమె డిజిటల్ టీమ్ ప్ర‌స్తుతం ఆ ఖాతాను పునరుద్ధరించడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అది తిరిగి రెడీ అయ్యే వ‌ర‌కూ.. అభిమానులను ఎటువంటి ఆహ్వానాలను అంగీకరించవద్దని లేదా వ్య‌క్తిగ‌త సమాచారాన్ని ఎవ‌రికీ షేర్ చేయొద్ద‌ని అభ్యర్థించింది. పూజా ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.